సీఎం జగన్ మాటలు స్వీట్ గా ఉంటాయి.. స్క్రిప్ట్ అనుకుంటా : శైలజానాథ్

-

జగన్మోహన్ రెడ్డి సర్కార్ ప్రజావ్యతిరేక విధానాలను అవలంభిస్తోందని అంటూ ఏపీ పీసీసీ అధ్యక్షుడు శైలజానాథ్ విమర్శలు గుప్పించారు, ప్రభుత్వం బాధ్యతారాహిత్యం కారణంగానే రాష్ట్రంలో కరోనా వైరస్ కేసులు పెరిగిగిపోతున్నాయి అంటూ విమర్శించారు. సీఎం జగన్ ఇప్పటికైనా రాజ ప్రసాదాన్ని వదిలి ప్రజల్లోకి రావాలి వ్యాఖ్యానించారు ఏపీ పీసీసీ అధ్యక్షుడు డాక్టర్ శైలజనాథ్.

సీఎం జగన్ మోహన్ రెడ్డి మాట్లాడే మాటలు అన్ని ఎంతో స్వీట్ గా ఉంటాయి అంటూ వ్యాఖ్యానించిన డాక్టర్ శైలజనాథ్… బహుశా సీఎం జగన్ స్క్రిప్ట్ ఫాలో అవుతారు కావొచ్చు అంటూ అభిప్రాయం వ్యక్తం చేశారు. విశాఖకు పరిపాలన రాజధానిని మారుస్తాము అంటున్న జగన్ సర్కార్… కేవలం తమ స్వప్రయోజనాల కోసం మాత్రమే ఇలాంటి చర్యలకు పాల్పడుతుంది అంటూ విమర్శించారు, జగన్ సర్కారు పాలన చేస్తున్నప్పటికీ వెనకుండి ఏదో అదృశ్య శక్తి జగన్ సర్కారు ను శాసిస్తోంది అంటూ కీలక వ్యాఖ్యలు చేశారు శైలజనాథ్,

Read more RELATED
Recommended to you

Latest news