BREAKING : ఏపీలో రేపు థియేటర్లు బంద్ !

-

ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా వ్యాప్తంగా రేపు నుంచి సినిమా థియేటర్లు బంద్ కు సిద్ధమవుతున్నారు ఎగ్జిబిటర్లు. జీవో 69 కి వ్యతిరేకంగా నిర్ణయం, ఈ నెల 2న జీవో విడుదల చేసింది ప్రభుత్వం..ఆన్ లైన్ లో టికెట్ లు ఏపీ ఎస్ ఎఫ్ టీ వీ టీ డీసి ద్వారా అమ్మి సర్వీస్ టాక్స్ మినహాయించుకుని తర్వాత థియేటర్లకు డబ్బులు ఇవ్వడం జీవో 69 సారాంశము.


నెలరోజుల లోపు ఏపీ ఫిలిం టెలివిజన్ థియేటర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ తో ఒప్పందం కుదుర్చుకోవాలని జీఓ విడుదల చేశారు. టిక్కెట్ల విక్రయాలు తెలుగు ఫిలిం చాంబర్ ఆఫ్ కామర్స్ ద్వారా చేపట్టాలనే దానిని వ్యతిరేకిస్తున్న ఎగ్జిబిటర్లు…ఎం ఓ యూ పై సంతకాలు చేస్తే డబ్బులు ఇవ్వకపోతే తమ పరిస్థితి ఏంటని అడుగుతున్నారు.

మధ్యవర్తిత్వం లో అందరూ ప్రభుత్వ ప్రతినిధులు ఉండడం ఏంటని ఎగ్జిబిటర్లు కూడా ఉండాలని అంటున్న ఎగ్జిబిటర్లు..థియేటర్ల మూసివేత పై నేడు హైకోర్టు తీర్పు ను బట్టి నిర్ణయాన్ని తీసుకోనున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news