Tirumala: తిరుమల శ్రీవారి ఏప్రిల్‌ లెక్కలు ఇవే..

-

Tirumala: తిరుమల శ్రీవారి ఏప్రిల్‌ లెక్కలు ప్రకటించారు టీటీడీ అధికారులు. ఏప్రిల్ నెలలో తిరుమల శ్రీవారిని దర్శించుకున్న భక్తుల సంఖ్య `20.17 లక్షలు అని ప్రకటించారు. అటు హుండీ కానుకలు ` రూ.101.63 కోట్లు వచ్చాయని వెల్లడించారు టీటీడీ అధికారులు.

tirumala

ఇక ఏప్రిలో విక్రయించిన శ్రీవారి లడ్డూల సంఖ్య ` 94.22 లక్షలు అని… అన్నప్రసాదం స్వీకరించిన భక్తుల సంఖ్య ` 39.73 లక్షలుగా నమోదు అయిందన్నారు అధికారులు. అలాగే… తలనీలాలు సమర్పించిన భక్తుల సంఖ్య `8.08 లక్షలు అని వెల్లడించారు టీటీడీ అధికారులు.

వేసవి తాపం నుండి ఉపశమనం కలిగించేందుకు చలువుపందిళ్లు, కూల్ పెయింటింగ్ లు ఏర్పాటు చేసామని తెలిపారు టీటీడీ ఈఓ ధర్మారెడ్డి. వేసవి సెలవులు దృష్ట్యా వచ్చే రద్దీకి అనుగుణంగా ఎప్పటికప్పుడు సౌకర్యాలు కల్పిస్తున్నామన్నారు టీటీడీ ఈఓ ధర్మారెడ్డి.

Read more RELATED
Recommended to you

Exit mobile version