తిరుమలలో మరో అపచారం..లడ్డులో పొగాకు పొట్లం !

-

తిరుమలలో మరో అపచారం జరిగింది..లడ్డులో పొగాకు పొట్లం తెరపైకి వచ్చింది. ఈ సంఘటన ఖమ్మం జిల్లాలో చోటు చేసుకుంది. ఖమ్మం జిల్లా గొల్ల గుడెంలో ఉంటున్న దొంతు పద్మావతి తన బంధువులతో కలిసి ఇటీవల తిరుమలకు వెళ్లి వచ్చారు. శ్రీవారిని దర్శించుకుని, మొక్కులు చెల్లించుకొని, తిరుమల లడ్డూను ప్రసాదంగా తీసుకొచ్చారు.

Tirumala Laddu

శ్రీవారి లడ్డూని పంచేందుకు తెరిచి చూడగా..ఆ ల‌డ్డూలో గుట్కా ప్యాకెట్, చిన్న పొగాకు ముక్కలు కనిపించడంతో ఒక్కసారిగా షాకయ్యారు. ఇక అటు తిరుమల లడ్డూలో జంతువుల కొవ్వు కలిపారన్న రచ్చ ప్రస్తుతం కొనసాగుతోంది. ఈ తరుణంలోనే..తిరుమల శ్రీవారి ఆలయంలో మహశాంతి యాగం
ప్రారంభమైంది. యాగశాలలో ప్రత్యేకంగా నిర్వహిస్తున్నారు అర్చకులు. ఇవాళ ఉదయం 10 గంటల వరకు క్రతువు కొనసాగనుంది. పంచగవ్య పదార్దాల సంప్రోక్షణతో ముగియనుంది మహాశాంతి యాగం.

 

Read more RELATED
Recommended to you

Exit mobile version