తిరుమల భక్తులకు బిగ్ అలర్ట్.. ఇవాళ దర్శన టికెట్స్ విడుదల

-

 

తిరుమల శ్రీవారి భక్తులకు బిగ్ అలర్ట్. ఇవాళ తిరుమల టికెట్లు విడుదల కాబోతున్నాయి. ఆన్లైన్లో… జనవరి నెల ఆర్జిత సేవా టికెట్లు ఇవాళ విడుదల చేయనుంది టీటీడీ పాలక మండలి. ఇవాళ ఉదయం 10 గంటల నుంచి ఎల్లుండి 10 గంటల వరకు.. లక్కి డిప్ రిజిస్ట్రేషన్ ఉంటుందని ప్రకటించింది. ఎల్లుండి మధ్యాహ్నం లక్కీ డిప్ విధానంలో… ఈ ఆర్జిత సేవా టికెట్లు కేటాయించనున్నారు. ఈ మేరకు అధికారిక ప్రకటన చేసింది టీటీడీ పాలక మండలి.

Renewal of permission for devotees on Tirumala Srivari Mettu Walkway

కాగా, తిరుమలలో 8 కంపార్టుమెంట్లలో వేచివున్నారు భక్తులు.. టోకెన్ లేని భక్తులకు శ్రీవారి సర్వదర్శనానికి 8 గంటల సమయం పడుతోంది.. 61,576 మంది భక్తులు.. నిన్న శ్రీవారిని దర్శించుకున్నారు. 23,412 మంది భక్తులు.. తలనీలాలు సమర్పించారు. ఇక హుండీ ఆదాయం రూ. 3.54 కోట్లుగా నమోదు అయింది.

Read more RELATED
Recommended to you

Exit mobile version