భారీగా తగ్గిన లడ్డు బరువు..TTD క్లారిటీ

-

తిరుమల భక్తులకు అందించే లడ్డు బరువు తగ్గడంపై టీటీడీ వివరణ ఇచ్చింది. ఇదిలా ఉంటే తిరుమలలో భక్తులకు అందించే శ్రీవారి లడ్డు ప్రసాదం బరువు నేపథ్యంలో తెలుగుదేశం పార్టీ విమర్శనాస్త్రాలు సంధించింది. దొంగలకు అధికారం ఇవ్వడం అంటే దోపిడీకి అనుమతి ఇచ్చినట్టేనని జగన్ అండ్ కో నిరూపిస్తోందని టిడిపి విమర్శించింది.

పరమ పవిత్రమైన తిరుపతి లడ్డు లోను వారు దోపిడిని వెతుక్కోవడం దారుణమని పేర్కొంది. 175 గ్రాములు ఉండాల్సిన తిరుపతి  ల డ్డు బరువు ఎంత తూగిందో మీరే చూడండి. అంటూ టిడిపి ఓ వీడియోను పంచుకుంది. అయితే దీనిపై టీ టీ డీ స్పందించింది. సాధారణంగా లడ్డు కౌంటర్ల వద్ద ఇబ్బందులు ఎదురైతే అక్కడే ఉండే కౌంటర్ అధికారికి తెలియజేస్తే సమస్య పరిష్కారం అయ్యే వ్యవస్థ టిటిడిలో ఉందని స్పష్టం చేసింది. కానీ, ఆ భక్తుడు ఇవేమీ చేయకుండా తమపై ఆరోపణలు చేశాడని ఇలాంటి ఆరోపణలు చేయడం విచారకరం అని టీటీడీ వెల్లడించింది.

Read more RELATED
Recommended to you

Latest news