ఏపీలో రూ.50 లకే టామోటా..ఆధార్‌ ఉంటేనే విక్రయాలు

-

రోజు రోజుకు కూరగాయల ధరలు మండిపోతున్నాయి. కాయగూరలు కొందామని మార్కెట్​కు వెళ్తున్న సామాన్యులు ధరలు చూసి తట్టుకోలేక ఖాళీ సంచులతో ఇంటికి తిరుగు పయనమవుతున్నారు. కూరల్లో అత్యంత ముఖ్యమైన టమాట, మిర్చిల ధరలు అన్నింటికంటే ఎక్కువగా ఉండటంతో బెంబేలెత్తిపోతున్నారు.

ఈ నేపథ్యంలోనే ఏపీలో రూ. 50 లకే టామోటా అందిస్తోంది జగన్‌ సర్కార్‌. ఆధార్ కార్డు ఉంటేనే టమోటా విక్రయాలు చేస్తోంది. నేటి నుంచి సబ్సిడీ పై టామాటా అమ్మకాలు ప్రారంభం అయ్యాయి. ఒక్కో ఫ్యామిలీకి కేజీ పరిమితి ఇవ్వనుంది సర్కార్‌. ఇక 50 రూపాయలకే రైతు బజార్లలో విక్రయిస్తోంది. విశాఖలోని సీతమ్మధార, గోపాలప ట్నం,ఎంవీపీ రైతు బజార్లను ఎంపిక చేసింది మార్కెటింగ్ శాఖ. దీంతో బహిరంగ మార్కెట్లో అనూహ్యంగా పెరిగింది టమోటా డిమాండ్.

 

Read more RELATED
Recommended to you

Exit mobile version