ఇవాల్టి కళ్యాణమస్తు కార్యక్రమాన్ని వాయిదా వేసిన టీటీడీ

-

తిరుమల టీటీడీ పాలక మండలి కీలక నిర్ణయం తీసుకుంది. పాలక మండలి ఆధ్వర్యంలో ఇవాళ నిర్వహించే కళ్యాణమస్తు కార్యక్రమాన్ని వాయిదా వేసింది టీటీడీ. ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లా కేంద్రాల్లో ఆగస్టు 7వ తేదీ ఉచిత సామూహిక వివాహాలు నిర్వహిస్తామని ప్రకటించింది టీటీడీ పాలక మండలి.

ఆగస్టు 7వ తేదీన ఉదయం 8.07 గంటల నుండి 8:17 నిమిషాల మధ్య అనురాధ నక్షత్రం సింహా లగ్నంలో వివాహాలు జరిపించాలని ముహూర్తం ఖరారు చేసిన టీటీడీ…ప్రభుత్వం నుండి ఉత్తర్వులు రాకపోవడంతో వాయిదా చేసింది. ప్రభుత్వం నుండి ఆదేశాలు వచ్చిన తరువాత కళ్యాణమస్తు నిర్వహణకు తేదీ ఖరారు చేయనుంది టీటీడీ పాలక మండలి. కల్యాణమస్తు వాయిదాను అధికారికంగా ప్రకటించలేదు టీటీడీ పాలక మండలి.

Read more RELATED
Recommended to you

Latest news