వ్యభిచార గృహానికి వెళ్లిన వ్యక్తిని విచారించడానికి వీల్లేదు: హైకోర్టు..

-

ఆంధ్ర ప్రదేశ్ హైకోర్టు ఓ సంచలన నిర్ణయం తీసుకుంది వ్యభిచార గృహానికి వెళ్ళిన విటుడిపై ( కస్టమర్) కేసు నమోదు చేసి, న్యాయస్థానంలో విచారించడానికి వీల్లేదు అని ఏపీ హైకోర్టు స్పష్టం చేసింది. ఓ వ్యక్తిపై దిగువ కోర్టులో పెండింగ్ లో ఉన్న కేసును రద్దు చేసింది. హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ డి.రమేష్ ఇటీవల ఈ మేరకు తీర్పు ఇచ్చారు. గుంటూరు జిల్లా నగరం పాలెం పోలీసులు 2020 లో నమోదు చేసిన కేసు ఆధారంగా గుంటూరు లోని మొదటి తరగతి జ్యుడిషియల్ మెజిస్ట్రేట్ పెండింగ్( ప్రత్యేక మొబైల్ కోర్టు) తనపై పెండింగ్ లో ఉన్న కేసును రద్దు చేయాలంటూ ఓ వ్యక్తి హైకోర్టును ఆశ్రయించారు.

అతడి తరపు న్యాయవాది వాదనలు వినిపిస్తూ.. 2020 అక్టోబరు 10 న పోలీసులు పిటిషనర్ పై కేసు నమోదు చేశారని, దర్యాప్తు జరిపి సంబంధిత కోర్టులో అభియోగపత్రం వేశారని తెలిపారు. వ్యభిచార గృహంపై దాడి చేసినప్పుడు అక్కడ పిటిషనర్ కస్టమర్ గా ఉన్నట్లు పోలీసులు ఆరోపిస్తున్నారని పేర్కొన్నారు. వ్యభిచార గృహాన్ని నిర్వహించేవారు, ఇంటిని వ్యభిచారం కోసం ఇచ్చే వారిపై కేసు పెట్టి విచారించ వచ్చు. కానీ సొమ్ము చెల్లించి విటుడిగా వెళ్ళిన వ్యక్తిని విచారించడానికి వీల్లేదు అని చట్ట నిబంధనలు చెబుతున్నాయని తెలిపారు. వ్యభిచార గృహానికి వెళ్ళిన కష్టమర్ పై నమోదైన కేసును ఇదే కోర్టు గతంలో కొట్టేసిందని గుర్తు చేశారు.

Read more RELATED
Recommended to you

Latest news