BREAKING : మాజీ మంత్రి వట్టి వసంత్‌కుమార్ మృతి

-

BREAKING : ఏపీ రాజకీయాల్లో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. తాజాగా ఏపీ మాజీ మంత్రి వట్టి వసంత్‌కుమార్ మృతి చెందారు. హైదరాబాద్‌ లోని అపోలో ఆస్పత్రిలో మాజీ మంత్రి వట్టి వసంత్‌కుమార్ మృతి చెందారు.

గత కొంత కాలంగా తీవ్ర అనారోగ్యంతో.. బాధపడుతున్న వసంత్‌ కుమార్‌… ఇవాళ మరణించారు. ఈ విషయాన్ని మాజీ మంత్రి వట్టి వసంత్‌కుమార్ కుటుంబ సభ్యులు తెలిపారు. దీనిపై ఇంకా వివరాలు తెలియాల్సి ఉంది.

కాగా, రాజశేఖర్‌రెడ్డి, రోషయ్య, కిరణ్‌కుమార్ రెడ్డి హయాంలో మంత్రిగా పనిచేసిన వట్టి.. 2004, 2009లో ఉంగుటూరు నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందారు. రాష్ట్ర విభజన తర్వాత.. రాజకీయాలకు గుడ్‌ బై చెప్పారు.

Read more RELATED
Recommended to you

Latest news