విజయవాడ కమ్యూనిస్టులకు కంచుకోట – డి. రాజా

-

విజయవాడలో సిపిఐ మహాసభలు జరగటం ఆనందంగా వుందన్నారు సిపిఐ జాతీయ ప్రధాన కార్యదర్శి డి. రాజా. విజయవాడ కమ్యునిస్ట్ లకు కంచుకోట అన్నారు. ఎంతో మంది కమ్యునిస్ట్ లు దేశం కోసం ప్రాణాలర్పించారని తెలిపారు. మైనారిటీలను, షెడ్యుల్ కులాలను బిజెపి నిర్వీర్యం చేస్తుందని ఆరోపించారు. బిజెపి హిందుత్వ ఎజెండాతో ప్రజల్ని మోసం చేస్తుందన్నారు.

దేశంలో కేరళ పరిపాలన మోడల్ రావాలన్నారు డి రాజా. మోదీ అంబానీ, అధానిలతో కుమ్మక్కయ్యారని ఆరోపించారు. కోవిడ్ టైమ్ లో ప్రజలను కేంద్రం గాలికి వదిలేసిందని మండిపడ్డారు. పబ్లిక్ సెక్టార్ లు ప్రైవేట్ పరమవుతున్నాయని ఆరోపించారు. దేశ ఆర్థికాభివద్ధి అంటే…. ప్రభుత్వ సంస్థలు ప్రైవేట్ పరం చేయటమా? అని ప్రశ్నించారు. మోదీ పగలు, రాత్రి ప్రైవేట్ సంస్థల కోసం పనిచేస్తున్నారని దుయ్యబట్టారు.

యువతకు మోదీ ఎన్నికల్లో ఇచ్చిన ఉద్యోగాల హామీ ఏమైందని ప్రశ్నించారు. ఆర్ఎస్ఎస్ హిందూ, హిందీ, హిందుస్థాన్ అనే పదాలతో మత విద్వేషాలను రెచ్చగొడుతుందన్నారు. బిజెపి, ఆర్ఎస్ఎస్ కు బుద్ధి చెప్పే రోజులు దగ్గర పడ్డాయన్నారు డి రాజా. దేశంలో ఎన్నో వనరులున్నా వాటిని వినియోగించుకోవటంలో బిజెపి విఫలం చెందిందన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news