బిజెపి, చంద్రబాబుతో పొత్తులపై చర్చలు జరిపాం – నాదెండ్ల మనోహర్

-

వచ్చే ఎన్నికల్లో పొత్తుల గురించి మరోసారి కీలక వ్యాఖ్యలు చేశారు జనసేన పిఏసి చైర్మన్ నాదెండ్ల మనోహర్. ప్రకాశం జిల్లా పర్యటనలో భాగంగా ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రానికి మేలు జరిగే విధంగా పొత్తులు ఉంటాయన్నారు. రాష్ట్ర భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని పార్టీలన్నింటినీ కలుపుకుని ముందుకు వెళతామని వెల్లడించారు. వైసిపి విముక్త ఆంధ్రప్రదేశ్ కోసం అందరం కలిసి కృషి చేస్తామని తెలిపారు.

బిజెపి ముఖ్య నాయకులు, చంద్రబాబుతో పొత్తులపై ఇప్పటికే చర్చలు జరిపామని.. కానీ సీట్ల గురించి చర్చలు జరగలేదన్నారు. పవన్ కళ్యాణ్ తీసుకునే నిర్ణయం పై పార్టీ నాయకులు అందరూ కట్టుబడి ఉంటారన్నారు నాదెండ్ల మనోహర్. అధికారంలోకి రాకముందు ఒక మాట.. వచ్చిన తర్వాత మరో మాట జనసేన మాట్లాడదన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news