ఆత్మకూరు గెలుపుతో మేము చంకలు గుద్దుకోము: మేకపాటి రాజమోహన్

-

ఆత్మకూరు ఉప ఎన్నికల్లో మేకపాటి విక్రమ్ రెడ్డిని భారీ మెజారిటీతో గెలిపించిన ఆత్మకూరు ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు మేకపాటి రాజమోహన్ రెడ్డి. ఈ గెలుపుతో వైఎస్ జగన్మోహన్ రెడ్డి పట్ల ప్రజలకు ఉన్న ఆదరణ ఏమాత్రం తగ్గలేదని నిరూపితమైంది అన్నారు. సీఎం జగన్ అమలు చేస్తున్న నవరత్నాలు ఈ విజయానికి కారణం అని అన్నారు. రాష్ట్రంలో ఎన్నడూ లేని విధంగా సంక్షేమ పథకాలు అమలు అవుతున్నాయని అన్నారు రాజమోహన్.

రాష్ట్రంలో బీజేపీ ఉనికే లేదని స్పష్టం చేశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి బీజేపీ తీవ్ర అన్యాయం చేసిందని మండిపడ్డారు. కేంద్రం ఇచ్చిన వాగ్దానాలను మరచి పోయింది అన్నారు. ఈ గెలుపుతో మేము చంకలు గుద్దుకోమన్న మేకపాటి రాజమోహన్.. 2024 ఎన్నికలు చాలా క్లిష్టతరమైనవి అని అన్నారు. ఎమ్మెల్యేలు, మంత్రులు, సీఎం జగన్ వచ్చే ఎన్నికలపై జాగ్రత్తగా ఉండాలని సూచించారు. చంద్రబాబును ఎదుర్కోవాలంటే సులువు కాదని, ఆయన అన్ని ఆయుధాలను సమకూర్చి బరిలోకి దిగుతారని అన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news