చంద్రబాబు విదేశీ పర్యటన రహస్యంగా ఉంచాల్సిన అవసరం ఏముంది : జోగి రమేష్

-

చంద్రబాబు విదేశీ పర్యటన రహస్యంగా ఉంచాల్సిన అవసరం ఏముంది అని మంత్రి  జోగి రమేష్ ప్రశ్నించారు. తాజాగా ఆయన తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. విదేశాల్లో పర్యటించిన చంద్రబాబు ఏ దేశాల్లో పర్యటించారో తెలియని పరిస్థితి నెలకొంది అన్నారు. సీఎం జగన్ లండన్ వెళ్లారని అధికారికంగా ప్రకటించారు. కానీ చంద్రబాబు ప్రకటించలేదు. చంద్రబాబుకు ప్రచార పిచ్చి బాగా ఉంది.

చంద్రబాబు దోచుకున్న డబ్బును విదేశాల్లో  దాచుకునేందుకే వెళ్లారా అని ప్రశ్నించారు.  సీఎం జగన్ లండన్ వెళ్లారని ధైర్యంగా చెప్పారు. కానీ చంద్రబాబు మాత్రం ఎందుకు చెప్పలేదన్నారు. ఎన్నిసార్లు అడిగినా చంద్రబాబు విదేశీ పర్యటన పై టీడీపీ సమాధానం చెప్పడం లేదన్నారు. చంద్రబాబు 10 రోజుల పాటు ఏ దేశానికి వెళ్లారు. చంద్రబాబు పర్యటనలో ఇంత దాపరికం ఎందుకు అని ప్రశ్నించారు. పరికరాల కొనుగోలు లో ఏబీ వెంకటేశ్వరరావు పాత్ర ఉందా లేదా అని ప్రశ్నించారు. ఏబీ వెంకటేశ్వరరావు నిజ స్వరూపం అందరికీ తెలుసు అన్నారు. ఎగ్జిట్ పోల్స్ తోనే తెలుగుదేశం పార్టీ ఓడిపోతుందని దిమ్మ తిరిగి బొమ్మ కనబడుతుంది. జూన్ 04న ఫలితాల వెలువడిన వెంటనే చంద్రబాబుకు మూర్చ వస్తుందన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news