మంత్రి హరీష్ రావు ఏపీపై చేసిన వ్యాఖ్యల్లో తప్పేముంది? – సిపిఐ రామకృష్ణ

-

తెలంగాణ మంత్రి హరీష్ రావు ఏపీ పై చేసిన వ్యాఖ్యల్లో తప్పేముందని అన్నారు సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ. ఏపీలో ఉద్యోగులు, ఉపాధ్యాయులపై జగన్ సర్కార్ నిరంకుశంగా ప్రవర్తించింది నిజం కాదా? అని ప్రశ్నించారు. ఉద్యోగులు, ఉపాధ్యాయులు చేపట్టిన శాంతియుత నిరసనలపై పోలీసులతో ఉక్కుపాదం మోపలేదా? సమాధానం చెప్పాలన్నారు. పిఆర్సి, సిపిఎస్ అంశాలలో ఉద్యోగుల ఆశలపై ఏపీ ప్రభుత్వం నీళ్లు చల్లిందా లేదా? అని మండిపడ్డారు.

ఉద్యోగులు, ఉపాధ్యాయులను పోలీస్ స్టేషనులకు పిలిపించి వేధించటం, గృహనిర్బంధాలు, వారి కుటుంబ సభ్యులను పలు రకాల వేధింపులకు గురి చేయటం నిజం కాదా? అని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆఖరికి టీచర్లను మద్యం షాపుల ముందు నిలబెట్టారా లేదా? అని ఫైర్ అయ్యారు. హరీష్ రావు ఉన్నది చెబితే వైసీపీ నేతలకు ఉలికిపాటేందుకన్నారు. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఉద్యోగ, ఉపాధ్యాయ వ్యతిరేక విధానాలు అవలంబించడాన్ని ఖండిస్తున్నామన్నారు సిపిఐ రామకృష్ణ.

Read more RELATED
Recommended to you

Latest news