టిడిపికి 2 సీట్లయినా వస్తాయా? – బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి

-

వచ్చే ఎన్నికలలో తెలుగుదేశం పార్టీకి రెండు సీట్లు అయినా వస్తాయా? అని ఎద్దేవా చేశారు ఏపీ శాప్ చైర్మన్ బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి. మంగళగిరిలో గెలవలేని వ్యక్తి పార్టీని అధికారంలోకి తీసుకు వస్తారా అని నారా లోకేష్ పై బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి తీవ్రస్థాయిలో మండిపడ్డారు. టిడిపి శ్రేణులు నిజాలు తెలుసుకోవాలని సూచించారు. అవినీతిపై నారా లోకేష్ మాట్లాడడం సిగ్గుచేటు అంటూ వ్యాఖ్యానించారు బైరెడ్డి.

ఆంధ్రప్రదేశ్ లో ఇల్లు కట్టుకొని రాజకీయాలు చేయమని టిడిపి నేతలు చంద్రబాబుకు చెబుతున్నారని తెలిపారు. చంద్రబాబు లాగా అబద్ధపు హామీలు ఇచ్చే అలవాటు తమకు లేదన్నారు. మంత్రి రోజాను మహిళా అని కూడా చూడకుండా ఇష్టానుసారం మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. సిమెన్స్ కంపెనీని వాడుకొని 250 కోట్లు దారి మళ్లించారని మండిపడ్డారు. ఈ కుంభకోణంపై విచారణ జరగకుండా అచ్చెన్నాయుడు స్టే తెచ్చుకున్నారని విమర్శించారు. రాష్ట్రం బాగుపడడం టిడిపికి ఇష్టం లేదన్నారు

Read more RELATED
Recommended to you

Latest news