జగన్ పిలుపుతో భారీగా తిరుపతి వైసీపీ శ్రేణులు..!

-

వెంకన్న మహా ప్రసాదం వివాదం రోజు రోజుకు ముదురుతున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఈ రోజు వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్ తిరుపతికి రానున్నారు. అలాగే ఆయన నిరసనకు పిలుపు ఇవ్వడంతో.. భారీగా కడప, అన్నమయ్య, నెల్లూరు, చిత్తూరు జిల్లాల నుంచి తిరుపతి రానున్నారు వైసీపీ శ్రేణులు. అయితే ప్రస్తుతం కడప జిల్లా సరిహద్దు ప్రాంతాల్లో తనిఖీ చేస్తున్నారు పోలీసులు. ఒంటిమిట్ట వద్ద వాహనాలను తనిఖీ చేసి అనుమతి ఇస్తున్నారు పోలీసులు.

ఇక ఈరోజు జగన్ నిరసనకు పిలుపు నిచ్చిన నేపథ్యంలో తిరుపతి జిల్లాలో 30పోలీస్ యాక్ట్ అమలు చేస్తున్నారు. 30 పోలీస్ యాక్ట్ అమలు నేపథ్యంలో సభలు సమావేశాలు నిషేధం. వైసీపీ అధినేత కడప జిల్లా వాసి కావడంతో.. కడప నుంచి భారీ స్థాయిలో పార్టీ శ్రేణులు తిరుపతి వెళ్లే అవకాశం ఉంది. పార్టీ నేతలను వెళ్లకుండా కట్టడికి పోలీసులు యత్నాలు జరుగుతున్నాయి. అలాగే తిరుపతి జిల్లాలో 30 పోలీస్ యాక్ట్ అమలు నేపథ్యంలో జిల్లా వ్యాప్తంగా తనిఖీలు చేపట్టారు పోలీసులు.

Read more RELATED
Recommended to you

Exit mobile version