BREAKING : రేపు ఇడుపులపాయకు వైఎస్ షర్మిల.. జగన్ కూడా !

-

వైఎస్‌ఆర్‌టీపీ పార్టీ అధినేత్రి వైఎస్ షర్మిల పాదయాత్రకు షార్ట్ బ్రేక్ పడింది. ఈ నేపథ్యంలోనే… పాదయాత్ర నుంచి హైదరాబాద్ చేరుకుంది వైఎస్ షర్మిల. ఇక రేపు ఇడుపులపాయకు వైఎస్ షర్మిల వెళ్లనున్నారు. ఎల్లుండి ఉదయం 8 గంటలకు వైఎస్సార్ జయంతి కార్యక్రమంలో పాల్గొననున్నారు వైఎస్ షర్మిల.

ఈ నెల 10 నుంచి వైఎస్‌ఆర్‌టీపీ పార్టీ అధినేత్రి వైఎస్ షర్మిల పాదయాత్ర తిరిగి ప్రారంభం కానుంది. అయితే… ఇవాళ, రేపు రెండు రోజుల పాటు కడపలో ముఖ్యమంత్రి జగన్ పర్యటించనున్నారు. ఇవాళ ఉదయం 9 గంటలకు తాడేపల్లి నివాసం నుంచి గన్నవరం విమానాశ్రయానికి బయలుదేరనున్న సీఎం జగన్.. 10 గంటల 20 నిమిషాలకు కడప ఎయిర్ పోర్ట్ కు చేరుకోనున్నారు.

11 గంటలకు పులివెందులలోని ఆర్ అండ్ బి గెస్ట్ హౌస్ కు చేరుకోనున్న సీఎం.. రెండు గంట పాటు పులివెందుల మున్సిపాలిటీ ప్రజాప్రతినిధులతో ముఖ్యమంత్రి జగన్ ఇంటరాక్షన్ కానున్నారు. మధ్యాహ్నం ఒంటి గంట నుంచి మూడు గంటల వరకు పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొననున్న ముఖ్యమంత్రి జగన్.. మూడు గంటలకు వేంపల్లి చేరుకోనున్నారు. మరీ ఈ పర్యటనలో వీరిద్దరూ ఎదురు పడతారో లేదో చూడాలి.

 

Read more RELATED
Recommended to you

Latest news