హోంమంత్రి అనితను కలిసిన వివేకా కుమార్తె వైఎస్ సునీత

-

ఏపీ హోంమంత్రి అనితను వైఎస్‌ వివేకా కుమార్తె వైఎస్ సునీత కలిశారు. వివేకా హత్య, ఆ తదనంతర పరిణామాలను ఈ సందర్భంగా సునీత హోంమంత్రి దృష్టికి తీసుకెళ్లారు. తన తండ్రి హత్య కేసులో జరిగిన అన్యాయాన్ని అనితకు వివరించారు. గత ప్రభుత్వ హయాంలో స్థానిక పోలీసులు హంతకులకు అండగా నిలిచారని .. వారిపై చర్యలు తీసుకోవాలని కోరారు.

విచారణ సమయంలో కేసును నీరుగార్చేలా వ్యవహరించారన్న సునీత.. సీబీఐ అధికారులపై తప్పుడు కేసుతో పాటు సాక్షులను బెదిరించారని హోంమంత్రికి వివరించారు. ఈ కేసు సీబీఐ విచారణలో ఉన్నందున ప్రభుత్వం తరఫున పూర్తి సహకారం ఉంటుందని మంత్రి అనిత భరోసా ఇచ్చినట్లు సమాచారం. దోషులకు శిక్ష పడేలా చూసేందుకు ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తోందని చెప్పినట్లు తెలిసింది. ఈ సందర్భంగా.. తప్పు చేసిన పోలీసులను వదిలిపెట్టేది లేదని హోం మంత్రి అనిత స్పష్టం చేశారు. ఇక ఇదే కేసుపై ఇంతకుముందు ముఖ్యమంత్రి చంద్రబాబు కూడా కీలక వ్యాఖ్యలు చేశారు. వివేకా హత్యపై సమగ్ర దర్యాప్తు చేయించి తప్పకుండా నిజాన్ని వెలికితీస్తామని అన్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version