నేడే వైఎస్సార్‌ చేయూత నిధులు విడుదల..26 లక్షల మంది మహిళలకు లబ్ది

-

ఏపీ: వరుసగా మూడో ఏడాది వైఎస్సార్‌ చేయూత..పథకాన్ని జగన్ సర్కార్ అమలు చేయనుంది. ఇందులో భాగంగా కుప్పంలో ఇవాళ వర్చువల్‌‌గా మహిళల ఖాతాల్లో నగదు జమ చేయనున్నారు సీఎం వైఎస్‌ జగన్‌. దీంతో రాష్ట్రవ్యాప్తంగా 26,39,703 మంది మహిళలకు లబ్ది.. చేకూరనుంది. అలాగే రూ. 4,949.44 కోట్ల ఆర్ధిక సాయాన్ని అందించనున్నారు ముఖ్యమంత్రి జగన్.

ఈ విషయాన్ని ఏపీ ఉపముఖ్యమంత్రి నారాయణస్వామి ప్రకటించారు. కుప్పంలో ఉపముఖ్యమంత్రి నారాయణస్వామి మీడియాతో మాట్లాడుతూ…. అమరావతి ప్రాంత వాసులది రైతు యాత్ర కాదు… కోటీశ్వరుల యాత్ర అని విమర్శలు చేశారు.

40 వేల దొంగ ఓట్లతోనే చంద్రబాబు నాయుడు ఇప్పటివరకు కుప్పంలో గెలుస్తూ వచ్చాడు… బీసీల ఓట్లతో కుప్పంలో గెలిచిన చంద్రబాబు నాయుడు వారికి చేసిందేమీ లేదని ఆగ్రహించారు. కుప్పంలో వైసిపి జెండా ఎగరాలి… కుప్పం ప్రజలు నాన్ లోకల్ అయిన చంద్రబాబును ఈ దఫా ఓడించి, లోకల్ గా ఉంటున్న భరత్ ను గెలిపించాలి. భరత్ గెలిస్తే మంత్రి అవుతారన్నారు. జగన్ పరిపాలనలో ప్రజలు మేల్కొన్నారు. సీఎం జగన్ కుప్పం పర్యటన విజయవంతం చేయండని కోరారు ఉపముఖ్యమంత్రి నారాయణస్వామి.

Read more RELATED
Recommended to you

Latest news