పోలీసులపై సంచలన ఆరోపణలు చేసిన సుబ్రమణ్యం భార్య

-

వైసీపీ ఎమ్మెల్సీ అనంతబాబు కారు డ్రైవర్‌ మృతి రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోంది. అయితే.. ఎమ్మెల్సీ కారులో శవంగా క‌నిపించిన సుబ్ర‌హ్మ‌ణ్యంను ఎమ్మెల్సీనే హ‌త్య చేశార‌ని బాధితుడి కుటుంబం ఆరోపిస్తున్న సంగ‌తి తెలిసిందే. ఈ క్ర‌మంలో ఈ ఘ‌ట‌న‌పై పోలీసులు అనుమానాస్ప‌ద మృతిగా కేసు న‌మోదు చేసుకుని మృత‌దేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం కాకినాడ ఆసుప‌త్రికి త‌ర‌లించిన సంగ‌తి తెలిసిందే. అయితే ఎమ్మెల్సీ అనంత‌బాబును అరెస్ట్ చేసేదాకా మృత‌దేహానికి పోస్టుమార్టం చేయ‌నీయ‌బోమంటూ అడ్డుకుంటోంది బాధిత కుటుంబం.

MLC Driver Death: రేపు కాకినాడలో టీడీపీ నిజనిర్ధారణ కమిటీ పర్యటన - NTV

ఈ క్ర‌మంలో ఏపీ పోలీసుల‌పై సుబ్ర‌హ్మ‌ణ్యం భార్య అనిత సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు చేశారు. సుబ్ర‌హ్మ‌ణ్యం మృత‌దేహం పోస్టుమార్టానికి అనుమ‌తి ఇస్తూ సంత‌కం పెట్టాల‌ని త‌న‌పై పోలీసులు ఒత్తిడి తీసుకువ‌స్తున్నార‌ని అనిత ఆరోపించారు. ఈ క్ర‌మంలోనే మ‌హిళా పోలీసుల‌తో త‌న‌ను కొట్టిస్తున్నార‌ని సంచ‌ల‌న ఆరోప‌ణ చేశారు అనిత. ఈ మేర‌కు ఓ వాయిస్ మెసేజ్‌ను ఆమె త‌న కుటుంబ స‌భ్యుల‌కు పంపింది. సుబ్ర‌హ్మ‌ణ్యం మృత‌దేహానికి పోస్ట్ మార్టం చేయడానికి ఒప్పుకోవాలంటూ అనిత‌తో పాటు ఆమె కుటుంబ స‌భ్యుల‌ను పోలీసులు కాకినాడ జిల్లా ఎస్పీ కార్యాల‌యానికి త‌ర‌లించిన సంగ‌తి తెలిసిందే.

Read more RELATED
Recommended to you

Latest news