రవితేజకు విలన్ గా బాలీవుడ్ స్టార్ !

-

మాస్ మహారాజా రవితేజ ఇటీవల రామారావు ఆన్ డ్యూటీ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. శరత్ మండవ దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రం దారుణమైన అపజయాన్ని మూటగట్టుకుంది. రవితేజ కెరీర్ లోనే పెద్ద అపజయంగా నిలిచింది. దీంతో రవితేజ తన తర్వాత సినిమాలపై దృష్టి పెట్టాడు. మాస్ మహారాజా ప్రస్తుతం ధామాక, టైగర్ నాగేశ్వరరావు, రావాణాసుర తో పాటు మెగా 154లో ఒక పాత్ర చేస్తున్నాడు.

ఇందులో టైగర్ నాగేశ్వర్ రావు సినిమా పాన్ ఇండియా స్థాయిలో విడుదల కానుంది. దీనిపై రవితేజ ఆశలు భారీగానే పెట్టుకున్నాడు. 1970 నేపథ్యంలో ఈ చిత్రం సాగుతుంది. స్టువర్ట్ పురం దొంగగా పేరు గాంచిన టైగర్ నాగేశ్వరరావు బయోపిక్ గా ఈ చిత్రం తెరకెక్కుతుంది.

నూపుర్ సనన్, గాయత్రీ భరద్వాజ్ హీరోయిన్లుగా నటిస్తుండగా, వంశీ దర్శకత్వం వహిస్తున్నాడు. కాగా ఈ సినిమా ప్రముఖ బాలీవుడ్ నటుడు అనుపమ్ ఖేర్ కీలక పాత్రలో నటిస్తున్నారు. అనుపమ్ ఖేర్ కశ్మీర్ ఫైల్స్ సినిమాతో అందరికి సుపరిచితం అయ్యాడు. అయితే.. ఈ సినిమాలోనే మరో బాలీవుడ్‌ స్టార్‌ ను విలన్‌ గా తీసుకునేందుకు సంసిద్ధం అవుతోందట చిత్ర బృందం. అయితే.. ఆ బాలీవుడ్‌ స్టార్‌ ఎవరనేది ఇంకా తెలియరాలేదు. త్వరలోనే దీనిపై క్లారిటీ రానుంది.

Read more RELATED
Recommended to you

Latest news