మరో కొత్త డాన్సర్.. ఈసారి కండక్టర్ ఝాన్సీ కి పోటీగా నెల్లూరు కవిత..!!

-

ప్రజలలోని ప్రతిభను వెలికి తీసే కార్యక్రమాలలో శ్రీదేవి డ్రామా కంపెనీ షో కూడా ఒకటి. లాక్ డౌన్ సమయం నుండే ప్రేక్షకులకు వినోదాన్ని పంచుతూ వస్తున్న ఈ కార్యక్రమం ప్రతి ఆదివారం ప్రసారం అవుతూ విజయవంతంగా దూసుకుపోతోంది. ఇక శ్రీదేవి డ్రామా కంపెనీ స్టేజ్ పైన కేవలం కామెడీ స్కిట్స్ మాత్రమే కాదు కొత్త టాలెంట్ ని కూడా ఎంకరేజ్ చేస్తూ ఉంటారు అని మనకు తెలిసిన విషయమే. వారం వారం కొత్త కాన్సెప్ట్ తో అలరిస్తున్న ఈ షోలో ఈవారం ఎపిసోడ్లో హైపర్ ఆది బర్తడే స్పెషల్ సరికొత్త ప్లాన్ చేసినట్లు తెలుస్తోంది. ఇక కొన్ని వారాలుగా ఈ షో కి యాంకర్ గా రష్మీ వ్యవహరిస్తుండగా ఈ వారం మాత్రం జడ్జిగా నటి ఇంద్రజ వ్యవహరించనుంది.

ఇకపోతే శ్రీదేవి డ్రామా కంపెనీని కూడా జబర్దస్త్ యాజమాన్యమే నిర్వహిస్తున్నారు. ఇక అలాగే పలువురు సీరియల్ ఆర్టిస్టులు, బుల్లితెర సెలబ్రిటీలు కూడా ఈ కార్యక్రమానికి హాజరవుతూ ఉంటారు. హైపర్ ఆది బర్తడే అంటూ స్టేజిపై కామెడీతో పాటు శ్రీరామదాసు సినిమాలోని ఒక పాట కూడా పాడి ఆకట్టుకున్నారు.. ఈ షోలో ఒకవైపు నూకరాజుతో కలిసి ఆది పాడిన పాట హైలైట్ అనుకుంటే మరొకవైపు నెల్లూరు కవిత అని మరో డాన్సర్ ను స్టేజ్ పై ప్రజెంట్ చేశారు. ఇకపోతే ఈ స్టేజి ద్వారానే గాజువాక కండక్టర్ ఝాన్సీ కూడా డాన్సర్ గా మంచి పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న విషయం తెలిసిందే.

ఇప్పుడు నెల్లూరు కవిత కూడా ఝాన్సీ ని మించిన టాలెంట్ తో వచ్చానని చెబుతూ స్టేజిపై ఝాన్సీకి పోటీగా చెలరేగిపోయింది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ప్రోమో ఒకటి నెట్టింట వైరల్ అవుతుంది. అయితే నెల్లూరు కవిత ఝాన్సీ ని మించిన టాలెంట్ అని ప్రూవ్ చేసుకుంటుందా లేదా అనేది ఈ ఆదివారం పూర్తి ఎపిసోడ్ లో చూడాల్సిందే.

Read more RELATED
Recommended to you

Latest news