ఏపీలో కొత్తగా 2010 కరోనా కేసులు, 20 మరణాలు

-

ఆంధ్ర ప్రదేశ్‌ లో కరోనా మహమ్మారి తీవ్రత కొనసాగుతూనే ఉంది. ఓ రోజు పెరుగుతూ.. ఓ రోజు కరోనా కేసులు తగ్గుతున్నాయి. తాజాగా నిన్నటి కంటే ఈ రోజు కాస్త పెరిగాయి కరోనా కేసులు. తాజాగా ఏపీ వైద్య ఆరోగ్య శాఖ విడుదల చేసిన బులెటిన్ ప్రకారం ఏపీలో గడిచిన 24 గంటల్లో కొత్తగా 2010 కరోనా కేసులు నమోదయ్యాయి.

దీంతో ఆంధ్ర ప్రదేశ్‌ లో మొత్తం పాజిటివ్‌ కేసుల సంఖ్య 19,57,047 కి పెరిగింది. ఒక్క రోజు వ్యవధిలో మరో 20 మంది చనిపోవడంతో కరోనా బారిన పడి మరణించిన వారి సంఖ్య 13,292 కి చేరింది. ప్రస్తుతం రాష్ట్రంలో 20,999 యాక్టివ్‌ కరోనా కేసులు ఉన్నాయి. ఇక గడిచిన 24 గంటల్లో 1956 మంది బాధితులు కరోనా మహమ్మారి నుంచి కోలుకున్నారు. ఇక నిన్న ఒక్క రోజే ఏపీలో 70,695 కరోనా నిర్ధారణ పరీక్షలు చేయగా ఇప్పటి దాకా 2,43,24, 626 కరోనా పరీక్షలు చేసినట్టు వైద్య ఆరోగ్య శాఖ ప్రకటించింది. ఇక ఇప్పటి దాకా కరోనా బారిన పడి డిశ్చార్జ్ అయిన వారి సంఖ్య 19,22,736 లక్షలకు చేరింది.

Read more RELATED
Recommended to you

Latest news