నేడు కోనసీమ జిల్లాలో సీఎం జగన్ పర్యటన… షెడ్యూల్ ఇదే

-

కాసేపట్లో జిల్లా కి సీఎం జగన్ పర్యటించనున్నారు. మురముళ్లలో వైఎస్సాఆర్ మత్స్యకార భరోసా కార్యక్రమాన్ని ప్రారంభించనున్నారు జగన్. ఈ పర్యటన కోసం మరికాసేపట్లో తాడేపల్లి నుంచి హెలికాప్టర్ లో ఐ పోలవరం మండలం కొమరగిరి వెళ్లనున్నారు. జిల్లా నేతలు, నాయకులు, ప్రజాప్రతినిధులతో సమావేశం కానున్నారు. అక్కడే ఏర్పాటు చేసిన మురుముళ్ల సభా ప్రాంగణం దగ్గరకు చేరుకుని ప్రజలను ఉద్దేశించి ప్రసంగించనున్నారు. ఓఎన్జీసీ పైప్ లైన్ వలను ఉపాధి కోలకోల్పోయిన 23458 మత్స్యకార కుటుంబాలకు ఓ ఎన్ జీ సి ఇచ్చే ఆర్ధిక సాయము అకౌంట్ లలో బదిలీ చేయనున్నారు జగన్ మోహన్ రెడ్డి. అక్కడే ఏర్పాటు చేసిన బహిరంగ సభలో సీఎం జగన్ ప్రసంగించనున్నారు. వేదిక మీద నుంచి జీ మూల పొలం లో చేపట్టనున్న నిర్మాణ పనులకు, గుత్తెన దీవి, గోగుళ్ల లంక వంతెన నిర్మాణాలు కు శంకుస్థాపన చేయనున్నారు సీఎం జగన్ మోహన్ రెడ్డి.

Read more RELATED
Recommended to you

Latest news