మదనపల్లె సబ్‌ కలెక్టరేట్‌ ఘటనపై ఏపీ డీజీపీ కీలక వ్యాఖ్యలు

-

మదనపల్లె సబ్ కలెక్టర్ కార్యాలయంలో జరిగిన ఘటన ఏపీలో కలకలం సృష్టిస్తోంది.ఈ ఘటనపై మీడియాతో మాట్లాడిన డీజీపీ ద్వారకా తిరుమలరావు కీలక వ్యాఖ్యలు చేశారు.మదనపల్లె సబ్‌ కలెక్టరేట్‌లో జరిగిన ఘటన యాక్సిడెంట్‌ కాదని, ఇన్సిడెంట్‌గా అనిపిస్తోందనీ ఏపీ డీజీపీ అన్నారు. రికార్డుల రూంలో అగ్నిప్రమాదం వెనుక కుట్రకోణం ఉందనీ అన్నారు. సీఎం చంద్రబాబు ఆదేశాల మేరకు సబ్ కలెక్టర్‌ కార్యాలయంలో దాదాపు మూడు గంటలకు విచారణ చేపట్టారు. అక్కడి పరిస్థితులను ఆయన ప్రత్యక్షంగా పరిశీలించారు. గత రాత్రి సుమారు 11.30 గంటలకు మదనపల్లె ఆర్డీవో కార్యాలయంలో అగ్నిప్రమాదం జరిగింది. 3 గంటల పాటు పరిశీలించిన తర్వాత అది యాక్సిడెంట్‌ కాదు.. ఇన్సిడెంట్‌గా భావిస్తున్నాం అని డీజీపీ ద్వారకా తిరుమలరావు అన్నారు.

22ఏ భూముల రికార్డులున్న గదిలో ఫైర్‌ ఇన్సిడెంట్‌ జరిగింది అని తెలిపారు. కీలక దస్త్రాలున్న విభాగంలో ఈ ఘటన చోటుచేసుకోవడం అనుమానాలకు తావిస్తోందనీ అన్నారు. అయితే ఘటన సమాచారం ఆర్డీవోకు తెలిసింది.. కానీ, కలెక్టర్‌కు సమాచారం ఇవ్వలేదు. ఘటన విషయం తెలుసుకున్న సీఐ కూడా ఎస్పీ, డీఎస్పీలకు సమాచారం ఇవ్వలేదని అన్నారు. కార్యాలయంలో షార్ట్‌ సర్క్యూట్‌ జరిగేందుకు అవకాశమే లేదని విచారణలో తేలిందని తెలిపారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version