తెలంగాణ భవన్‌కు చేరుకున్న తోట చంద్ర‌శేఖ‌ర్, రావెల కిషోర్ బాబు

-

ఏపీలో రాజకీయ సమీకరణాలు మారుతున్నాయి. అయితే.. ఏపీకి చెందిన పలువురు నేతలు బీఆర్‌ఎస్‌లోకి చేరేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలోనే.. తెలంగాణ భ‌వ‌న్‌కు ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్రానికి చెందిన మాజీ మంత్రి రావెల కిషోర్ బాబు, మాజీ ఐఏఎస్ తోట చంద్ర‌శేఖ‌ర్, మాజీ ఐఆర్ఎస్ చింత‌ల పార్ఠ‌సార‌థి తెలంగాణ భ‌వ‌న్‌కు చేరుకున్నారు. మ‌రికాసేప‌ట్లో సీఎం కేసీఆర్ స‌మ‌క్షంలో వీరు భార‌త్ రాష్ట్ర స‌మితి పార్టీలో చేరనున్నారు.

భారీ కాన్వాయ్‌తో తెలంగాణ భ‌వ‌న్‌కు చేరుకున్న రావెల కిషోర్ బాబు, తోట చంద్ర‌శేఖ‌ర్, చింతల పార్థ‌సార‌థికి మంత్రి గంగుల క‌మలాక‌ర్, ప్ర‌భుత్వ విప్ బాల్క సుమ‌న్, ఎమ్మెల్సీ ప‌ల్లా రాజేశ్వర్ రెడ్డి, నాయ‌కుడు దాసోజు శ్ర‌వ‌ణ్‌తో పాటు ప‌లువురు ఘ‌న‌స్వాగ‌తం ప‌లికారు. ఈ ముగ్గురితో పాటు టీజే ప్ర‌కాశ్‌(అనంత‌పురం), తాడివాక ర‌మేశ్ నాయుడు(కాపునాడు, జాతీయ అధ్య‌క్షుడు), గిద్ద‌ల శ్రీనివాస్ నాయుడు(కాపునాడు, ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి), రామారావు(ఏపీ ప్ర‌జా సంఘాల జేఏసీ అధ్య‌క్షుడు) కూడా బీఆర్ఎస్ తీర్థం పుచ్చుకోనున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news