Breaking : రేపు టీడీపీ చలో నర్సీపట్నం..

-

మాజీ మంత్రి, టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు అయ్యన్నపాత్రుడు ఇంటి గోడ కూల్చివేతపై టీడీపీ సీరియస్ అయింది. నర్సీపట్నంలో నిరసన వ్యక్తం చేయాలని నిర్ణయించారు. ఈ మేరకు సోమవారం చలో నర్సీపట్నంకు టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు పిలుపు నిచ్చారు. ప్రభుత్వ తప్పులను ప్రశ్నిస్తున్న టీడీపీ నేతలను ప్రభుత్వం టార్గెట్ చేసిందని.. అందుకే ఆస్తులకు నష్టం కలిగిస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు అచ్చెన్నాయుడు. గతంలో పల్లా శ్రీనివాస్, సబ్బం హరి, బీసీ నేతల ఆస్తులపైనా దాడులు చేశారని గుర్తు చేశారు. ప్రశ్నించిన వారిపై దాడి చేయించడం జగన్‍కు అలవాటైందని అచ్చెన్నాయుడు మండిపడ్డారు. బీసీల పట్ల జగన్ చూపిస్తున్న కపట ప్రేమను నిలదీస్తామని హెచ్చరించారు అచ్చెన్నాయుడు. మరోవైపు నర్సీపట్నంలో టెన్షన్ వాతావరణం కొనసాగుతోంది.

Former Andhra Min and TDP MLA K Atchannaidu held for alleged involvement in  ESI scam | The News Minute

అయ్యన్న ఇంటి గోడను కూల్చడం పట్ల నర్సీపట్నం టీడీపీ నేతలు, కార్యకర్తలు ఆగ్రహం వ్యక్తం చేశారు అచ్చెన్నాయుడు. అయ్యన్న పాత్రుడి ఇంటి వద్దకు భారీగా చేరుకున్నా. దాంతో పోలీసులు వారిని అడ్డుకుంటున్నారు. అటు తమ ఇంటిని కూల్చివేయడాన్ని అయ్యన్నపాత్రుడి కుటుంబ సభ్యులు తప్పుబడుతున్నారు. నర్సీపట్నం మున్సిపల్ అధికారులు, పోలీసుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. తమ ఇంటికి మున్సిపల్ అధికారుల అనుమతి ఉందని.. అయ్యన్న ప్రశ్నిస్తున్నాడని ప్రభుత్వం కక్ష గట్టిందని ఆరోపించారు.ఇల్లు నిర్మించిన స్థలంలో ఆక్రమణ ఉంటే సర్వే చేయాలని అయ్యన్నపాత్రుడు చిన్న పాత్రుడు చిన్న కుమారుడు స్థానిక ఆర్డీవోకు వినతి పత్రం అందజేశారు. ఎంత వరకు ఆక్రమణ ఉందో మార్క్ చేసి చేస్తే తామే నిర్మాణాన్ని తొలగిస్తామని చెప్పారు. ఆక్రమణ లేనిపక్షంలో తొలగించిన గోడను నిర్మించి ఇవ్వాలని డిమాండ్ చేశారు.

Read more RELATED
Recommended to you

Latest news