ఎవరికీ చెప్పలేక కుంగిపోయా.. శరీరంపై మచ్చలేంటని అడిగితే అదే చెప్తా.. మమతా మోహన్ దాస్

-

టాలీవుడ్ హీరోయిన్ మమతా మోహన్ దాస్ క్యాన్సర్ తో పోరాడి కోలుకున్న సంగతి తెలిసిందే. అయితే అతి భయంకరమైన క్యాన్సర్ వ్యాధి నుంచి బయటపడిన మమతా.. ఆ తర్వాత అరుదైన మరొక వ్యాధి బారిన పడ్డాను అంటూ చెప్పుకొచ్చారు. ఈ వ్యాధి తనను మానసికంగా ఎంతో కుంగదీసిందని అయినప్పటికీ మళ్లీ జీవితంలో ధైర్యంగా ముందుకు వెళ్తున్నా అంటూ తెలిపారు.

టాలీవుడ్ లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న నటి మమతా మోహన్ దాస్ కెరీర్ లో నటించిన సినిమాలు తక్కువే అయినప్పటికీ మంచి పేరు సంపాదించుకున్నారు. నటిగా, గాయనిగా మంచి పేరు సంపాదించుకున్న మమతా.. తెలుగు, తమిళ, మలయాళ భాషల్లో నటించారు. దర్శక ధీరుడు రాజమౌళి యంగ్ టైగర్ ఎన్టీఆర్ తో తెరకెక్కించిన యమదొంగ చిత్రంతో టాలీవుడ్కు పరిచయమయ్యారు. కృష్ణార్జున, హోమం వంటి చిత్రాల్లో నటించారు. 2010లో మమత మోహన్ దాస్ క్యాన్సర్ బారిన పడ్డారు. చికిత్స తీసుకొని ఆ వ్యాధి నుంచి కోలుకున్నాక 2011 లో వ్యాపారవేత్త ప్రజిత్ పద్మనాభన్ నువ్వు పెళ్లి చేసుకున్నారు. అయితే సంవత్సరం తిరగకుండానే ఈ జంట విడాకులు తీసుకున్నారు. ఆ తర్వాత మళ్లీ మమతా మోహన్దాస్ రెండోసారి క్యాన్సర్ బారిన పడ్డారు.

Cancer returns, Mamta to take break from films.... | Mollywood Frames

రెండుసార్లు కేన్సర్ వ్యాధి నుంచి కోలుకున్న మమత తర్వాత మాత్రం ఒక ఆటో ఇమ్యూన్ డిసీస్ బారినపడి మానసికంగా కుండిపోయాను అంటూ తాజాగా చెప్పుకొచ్చారు.. “నాకు క్యాన్సర్‌ సోకినప్పుడు నా ఫ్రెండ్స్‌, సన్నిహితులతో సమస్య గురించి చెప్పుకున్నాను. వారు చాలా ధైర్యం ఇచ్చారు.. కానీ నాకు ‘విటిలిగో’ అనే ఆటో ఇమ్యూన్ వ్యాధి బారిన పడ్డానని తెలియగానే ఒంటరిగా కూర్చుని ఏడ్చేదాన్ని.. ఎప్పుడూ కెమెరా ముందు ఉండే నేను ఒంటరితనాన్ని భరించలేకపోయాను. చనిపోతానేమో అని భయమేసింది.. అందుకే ఈ సమస్యను అందరికీ తెలిసేలా చేశాను. దీంతో కాస్త రిలీఫ్‌ అనిపించింది. ఎవరైనా నా శరీరంపై ఆ మచ్చలేంటని అడిగితే నా ఇన్‌స్టా చూడమని నిర్మొహమాటంగా చెబుతున్నా” అంటూ చెప్పుకొచ్చారు మమతా..

Read more RELATED
Recommended to you

Latest news