తెరపైకి మళ్లీ నరేశ్ వ్యవహారం… ఆయకు ఇలా జరుగుతుందని ముందే చెప్పానంటూ.. వేణు స్వామి కామెంట్స్…

-

గత కొంత కాలంగా సీనియర్ నటుడు నరేష్, పవిత్రా లోకేష్​ల పేర్లు చిత్రసీమలో హాట్​టాపిక్​గా మారాయి. వీరి వ్యవహారం ఎక్కడ చూసినా వైరల్​గా మారింది. వీరు రిలేషన్​షిప్​లో ఉన్నట్లు, త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నట్లు అనేక ఊహాగానాలు వినిపించాయి. సోషల్​మీడియాలో ఎక్కడ చూసిన వీరి గురించే అనేక కథనాలు వచ్చాయి. అయితే మైసూర్‌లోని ఓ హోట‌ల్‌లో న‌రేష్‌, ప‌విత్ర లోకేష్​లను రమ్య రఘుపతి రెడ్​ హ్యాండెడ్​గా పట్టుకోవడంతో ఈ వ్యవహారం మరింత ముదిరింది. నరేశ్​పై అతడి భార్య, పవిత్రపై ఆమె భర్త.. మీడియా తెరపైకి రావడం జరిగింది. తాజాగా నరేష్ వ్యవహారంపై సినీ, రాజకీయ ప్రముఖుల జ్యోతిష్యాలను చెప్పే ఆస్ట్రాలజర్‌ వేణు స్వామి కీలక వ్యాఖ్యలు చేశారు.

వేణు స్వామి గురించి ప్రస్తుతం తెలుగు ప్రేక్షకులకు పరిచయం అక్కర్లేదు. సమంత-నాగ చైతన్య విడాకులు తీసుకున్న తర్వాత వేణు స్వామి ఒక్కసారిగా వెలుగులోకి వచ్చాడు. సామ్ చైతు విడిపోతారని ఆయన ముందే చెప్పాడు. ఇక అప్పటి నుంచి వేణు స్వామి వీడియోలు వైరల్​గా మారాయి. నయన్-విఘ్నేష్‌ శివన్‌ల వివాహం సందర్భంగా కూడా వేణు స్వామి ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. అసలు నయనతారకు పెళ్లి అచ్చిరాదని.. భవిష్యత్తులో విడాకులు తప్పవని కామెంట్‌ చేశాడు. అప్పుడు కూడా ఈ న్యూస్ తెగ వైరల్ అయింది. సోషల్ మీడియాలో హల్ చల్ చేసింది. ఇదిలా ఉండగా… మళ్లీ వేణు స్వామి సంచలన వ్యాఖ్యలు చేశాడు. నరేష్‌ విడాకుల గురించి.. ఆయన కుటుంబంలో చోటు చేసుకోబోయే పరిణామాల గురించి…. ముందే చెప్పానంటూ… ఓ ఇంటర్వ్యూలో తెలిపాడు. దీనితో ఆయన మరోసారి వార్తల్లో నిలిచాడు.

తాజాగా ఓ ఇంటర్వ్యూకు ఇచ్చిన ఆయన.. కృష్ణ, నరేష్​ల గురించి ఇలా చెప్పుకొచ్చారు ”కృష్ణ‌గారు నా ఫేవ‌రేట్ హీరో. ఏ స్థాయికి నేను వ‌చ్చిన‌ప్ప‌టికీ కృష్ణ‌ గారింట్లో పూజ‌లు చేయ‌టం మాన‌లేదు. నేను రెగ్యులర్‌గా వారింట్లో పూజ‌లు చేస్తున్న సంద‌ర్భంలో జాత‌కాలు కూడా చెప్పేవాడిని. 2014లోనే న‌రేష్‌, ర‌మ్య ర‌ఘ‌ప‌తి పెళ్లి జ‌రిగింది. అప్పుడు కూడా నేను వారి జాత‌కాలు చూశాను. అవి క‌ల‌వ‌లేదు. జాత‌కాలు క‌ల‌వ‌టం లేదు కాబ‌ట్టి… పెళ్లి అయినా విడాకులు అవుతాయ‌ని చెప్పాను. అందుక‌నే నేను వారి పెళ్లి నా చేతుల మీదుగా చేయ‌లేదు. కానీ వారి ఇంట్లో జ‌రిగిన వ్ర‌తాన్ని నేనే చేశాను. ముహుర్తం పెట్టే స‌మ‌యంలోనూ నేను చెప్పినా… కృష్ణ గారి కుటుంబం వినలేదు.

వాళ్లు జాత‌కాలు మార్చి పెళ్లి చేసుకున్నార‌ని అనిపించింది. ఇది పూర్తిగా వారి వ్య‌క్తిగ‌త విష‌యం. నేను ఓపెన్​గా చెప్పడంతో వారు నన్ను దూరం పెట్టారు. అప్పటి నుంచి నరేష్ ఇంటికి నేను వెళ్లడం లేదు. కానీ జాత‌కాలు క‌ల‌వ‌కుండా పెళ్లి చేసుకుంటే క‌లిసి ఉండ‌లేర‌న‌డానికి ఇదొక ఉదాహరణ. ” అని వేణుస్వామి తెలిపారు.

” అప్పట్లో కృష్ణ‌, విజ‌య నిర్మ‌ల‌గారి జాత‌కాలు చూశాను. 2020లో వారి ఇద్ద‌రిలో ఒక‌రు చ‌నిపోతార‌ని చెప్పా… ఆ మాట‌లు విన్న విజ‌య నిర్మ‌ల‌గారు భ‌య‌ప‌డ్డారు. అంటే ఆమెను భ‌య‌పెట్ట‌డ‌మ‌నేది నా ఉద్దేశం కాదు. ఉన్న విష‌యాన్ని చెప్పాను. దానికి ప‌రిహారం చేసుకుంటే బావుంటుంద‌ని చెప్పాను” అని చెప్పుకొచ్చాడు. అయితే ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్​గా మారాయి.

గ‌తంలో నరేశ్ తన మూడో భార్యరమ్య మంచిదని ప్రకటించారు. రమ్య గొప్ప వ్య‌క్తిత్వం ఉన్న మ‌నిష‌ని, త‌న ఆలోచ‌న‌ల‌కు, అభిప్రాయాల‌కు స‌రిపోయే వ్య‌క్తి అని ప్రశంసించారు. మరి ఇప్పుడు వారి మధ్య ఎందుకు దూరంగా ఉంటున్నారో తెలియదు. పవిత్ర లోకేశ్ విషయం బయటకు రాగానే.. నరేష్ కూడా ఆమె భార్య రమ్యపై ఆరోపణలు చేశారు. రమ్యకు వేరే వ్యక్తితో వివాహేతర సంబంధం ఉందని అన్నాడు. అతనితో కలిసే డబ్బుల కోసం డ్రామాలు ఆడుతుందని నరేష్ ఆరోపించారు. ఏది ఏమైనా… నరేశ్ వ్యవహారం.. మరోకసారి వేణు స్వామి వ్యాఖ్యలతో నెట్టింట హల్​చల్ చేస్తోంది.

Read more RELATED
Recommended to you

Latest news