జగన్ కు ఓటేయడం తప్పే.. ప్రజలపై రెచ్చిపోయిన అచ్చెన్న

-

టీడీపీ ఏపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు సంచలన వ్యాఖ్యలు చేశారు. జగనుకు ఓటేసి ప్రజలు తప్పు చేశారని.. ప్రజలకు జగన్ చరిత్ర తెలిసి మరీ ఓటేశారని ఫైర్ అయ్యారు. జైల్లో ఉండి వచ్చిన వ్యక్తికి ప్రజలు ఓట్లేయడమంటే ప్రజలు చేసిన తప్పు కాక మరేమిటీ.. ? అని రెచ్చిపోయారు. చంద్రబాబుకంటే ఎక్కువగా ఏదో మంచి చేస్తారని ప్రజలు ఓట్లేశారని.. ఇచ్చిన హామీలన్నీ చేసేస్తాడేమో.. మనం ఏమైపోతాం అని.. రాజకీయంగా ఉండగలమా..? లేదా..? అని నేనూ భయపడ్డానని వెల్లడించారు.

కానీ జగన్ ఏం చేయలేదు.. మాట తప్పారని.. టీడీపీని లేకుండా చేసేందుకు వైసీపీ చాలా ప్రయత్నాలే చేసిందని ఫైర్ అయ్యారు. టీడీపీ.. వైసీపీ తరహాలో గాలికి పుట్టి.. గాలికి పెరగలేదని.. దేవాలయం లాంటి పార్టీ కార్యాలయంపై దాడి చేయడానికి వైసీపీ నేతలకు సిగ్గు లేదా..? అని మండిపడ్డారు.

టీడీపీ హయాంలో ప్రారంభించిన ఫైబర్ గ్రిడ్ ప్రాజెక్టులో ఏదో స్కామ్ జరిగిందని వెతికి వెతికి వేసారి పోయారని.. ఎంతో వెతికినా ఏం పీకలేపోయారని మండిపడ్డారు. సీమెన్స్ ప్రాజెక్టు వస్తే రాష్ట్రానికి తెచ్చామని.. రూ. 3300 కోట్లు అంచనాతో సీమెన్స్ ప్రాజెక్టు రాష్ట్రానికి తెచ్చామన్నారు. 90 శాతం ఖర్చు సీమెన్స్ కంపెనీది.. 10 శాతం ప్రభుత్వం ఖర్చు చేసేలా ఒప్పందం జరిగిందని.. నాటి ప్రభుత్వం ఈ సీమెన్స్ ప్రాజెక్టు కోసం రూ. 330 కోట్లు ఇస్తే.. రూ. 250 కోట్లు స్కామ్ జరిగిందన్నారని వెల్లడించారు.

Read more RELATED
Recommended to you

Latest news