ఏపీలో దారుణం.. బాలికపై గ్రామ వాలంటీర్ అత్యాచారం

-

ఆంధ్రప్రదేశ్ లో గ్రామ వాలంటీర్ గా పనిచేస్తూూ ఇళ్లకు వెళ్తున్న క్రమంలో ఓ బాలిక తో పరిచయం పెంచుకున్న యువకుడు అత్యాచారానికి పాల్పడ్డాడు.ఇంటింటికీ తిరుగుతున్న క్రమంలో వాలంటీర్ సతీష్ ఆ బాలికతో పరిచయం పెంచుకొని ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఈ అఘాయిత్యానికి పాల్పడ్డాడు.నిందితుడిపై పోలీసులు ఫోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు.తూర్పుగోదావరి జిల్లా సీతానగరం మండలం బొబ్బిల్లంక కు చెందిన గ్రామ వాలంటీర్ బూసి సతీష్(23) అదే గ్రామానికి చెందిన బాలికపై అత్యాచారం చేశాడు.

ఇంటింటికి తిరుగుతూ ఉన్న క్రమంలో ఆ బాలికతో పరిచయం పెంచుకొని ఇంట్లో ఎవరూ లేని సమయంలో నమ్మించి అఘాయిత్యానికి తెగబడ్డాడు.ఈ విషయాన్ని బయటకు చెప్పవద్దు అని బెదిరించాడు.ఆదివారం బాధితురాలి తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు సతీష్ పై పోక్సో కింద కేసు నమోదు చేశారు.బాలికను చికిత్స నిమిత్తం రాజమహేంద్రవరం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించినట్లు ఎస్ఐ కె. శుభ శేఖర్ తెలిపారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version