నిజామాబాద్ లో దారుణం.. మహిళపై ఆటో డ్రైవర్ అత్యాచారం..ఆ తరవాత.!

-

నిజామాబాద్ జిల్లా కేంద్రంలో దారుణం చోటుచేసుకుంది. అనారోగ్యం కారణంగా ఓ మహిళ ఆస్పత్రిలో చేరేందుకు వచ్చింది. అయితే బెడ్ లు ఖాళీగా లేకపోవడంతో మరుసటి రోజు రావాలని సిబ్బంది కోరారు. దాంతో మరుసటి రోజు వస్తానని చెప్పి మహిళ ఆటోలో ఇంటికి బయలు దేరింది. ఈ క్రమంలో ఆటో డ్రైవర్ బాలాజీ మహిళను దారి మళ్లించి మారుమూల ప్రాంతానికి తీసుకెళ్లి అత్యాచారం చేసి అనంతరం హత్య చేశారు. నిందితుడు బాలాజీ కి ఆకాష్ అనే మరో యువకుడు సహకరించినట్లు తెలుస్తోంది.

ఇద్దరూ కలిసి మహిళపై అత్యాచారం చేసి అనంతరం హత్య చేసి గుండారం చెరువు లో పడేశారు. అంతేకాకుండా మహిళ ఒంటిపై ఉన్న బంగారాన్ని దోచుకున్నారు. ఆగస్టు 1వ తేదీన కుటుంబసభ్యులు మహిళ కనిపించడం లేదంటూ పోలీసులకు ఫిర్యాదు చేశారు. అయితే ఆగస్టు 2వ తేదీన గుండారం చెరువు లో మృతదేహం కనిపించడంతో విచారణ జరిపారు. ఆటో డ్రైవర్ బాలాజీ మరియు ఆకాష్ హత్య చేశారని గుర్తించారు. నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారించగా నిజం బయటపెట్టారు. స్థానికంగా ఈ ఘటన కలకలం రేపింది.

Read more RELATED
Recommended to you

Latest news