ఢిల్లీ లిక్కర్‌ స్కాం.. ఎమ్మెల్సీ కవిత మాజీ ఆడిటర్‌కు బెయిల్‌

-

దేశవ్యాప్తంగా ఢిల్లీ లిక్కర్ స్కామ్ సంచలనం సృష్టిస్తున్న విషయం తెలిసిందే. ఈ కేసులో ఎన్నో మలుపులు… కీలక పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. ఇప్పటికే ఈ మద్యం స్కామ్‌లో కీలక వ్యక్తులు అరెస్టు కాగా.. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత మాజీ ఆడిటర్ గోరంట్ల బుచ్చిబాబును కూడా ఇటీవల సీబీఐ ( సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్విస్టేగేషన్) అరెస్టు చేసిన విషయం తెలిసిందే. అయితే తాజాగా గోరంట్ల బుచ్చిబాబు బెయిల్ పిటిషన్​పై రౌస్ అవెన్యూ కోర్టు విచారణ చేపట్టింది. ఢిల్లీ మద్యం కేసులో గోరంట్ల బుచ్చిబాబుకు రౌస్ అవెన్యూ కోర్టు బెయిల్ మంజూరు చేస్తూ తీర్పును వెలువరించింది.

 

అయితే ఈ బెయిల్ నిబంధనలతో కూడినట్లు ఉంటుందని స్పష్టం చేసింది. పాస్‌పోర్టు జమ చేయాలని, రూ.2 లక్షల పూచీకత్తు ఇవ్వాలని ఆదేశాలు జారీ చేసింది. ఇక ఈ ఢిల్లీ మద్యం కేసులో కవిత ఆడిటర్ గోరంట్లకు జ్యుడీషియల్ కస్టడీ పొడిగించిన విషయం తెలిసిందే. సీబీఐ అరెస్టు చేసిన బుచ్చిబాబుకు 14 రోజుల కస్టడీని పొడగించారు. ఈ కేసు దర్యాప్తులో ఉన్నందున కస్టడీ పొడిగించాలని సీబీఐ.. కోర్టును కోరగా…. సీబీఐ విజ్ఞప్తి మేరకు ప్రత్యేక కోర్టు కస్టడీని పెంచింది. ఈ విషయంపై
తదుపరి విచారణను మార్చి 9 వ తేదీకి వాయిదా వేసింది.

Read more RELATED
Recommended to you

Latest news