ఏపీలో నలుగురు మంత్రుల మాఫియా : బాలయ్య సంచలన వ్యాఖ్యలు

-

హిందూపురం మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో ఎమ్మెల్యే బాలకృష్ణ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన ఏపీ ప్రభుత్వం మీద విమర్శలు గుప్పించారు. ఏపీలో 20 సంవత్సరాలు వెనక్కి వెళ్లాలని ఆయన అన్నారు. ఇసుక,మద్యం మాఫియా రాజ్యమేలుతున్నాయి అని విమర్శించారు. అలాగే రాష్ట్రంలో యువత భవిష్యత్ అంధకారం అయిందని బాలయ్య విమర్శించారు. జవాబుదారీతనం ఉన్న పార్టీకి ప్రజలు ఓటేయాలని బాలకృష్ణ పిలుపునిచ్చారు.

నిత్యావసర వస్తువుల ధరలు సామాన్యులకు అందుబాటులో లేవని రెండేళ్లలో ఏమి చేశారు అనే దాని మీద శ్వేతపత్రం విడుదల చేయాలని బాలకృష్ణ డిమాండ్ చేశారు. రాష్ట్రంలో అన్ని వ్యవస్థలను నిర్వీర్యం చేశారన్న ఆయన అన్ని ప్రైవేట్ పరం చేసి వ్యవస్థలను సైతం నిర్వీర్యం చేశారని అన్నారు. అలాగే ఆంధ్రప్రదేశ్ లో నలుగురు మంత్రుల మాఫియా నడుస్తుందని బాలయ్య విమర్శలు గుప్పించారు. అలాగే ఒక మంత్రి చంద్రబాబు తిట్టడానికి మరో మంత్రి లిక్కర్ మాఫియా నడపడానికి ఉన్నారని బాలకృష్ణ విమర్శించారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version