ప్రతిపక్షాలను చూసి భయపడుతున్న జగన్ : నందమూరి బాలకృష్ణ

-

నాలుగున్నర ఏళ్ల వైసిపి పాలన లో రాష్ట్రం అన్ని రంగాల్లో కూడా కుదేలు అయ్యిపోయింది. ప్రతిపక్షాలని చూసి సీఎం జగన్ భయపడుతున్నారని హిందూపూర్ ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ కామెంట్స్ చేశారు. ఇవాళ అసెంబ్లీ సమావేశాలకి హాజరైన అయినా బై బై జగన్ ప్లకార్డులని పట్టుకుని టిడిపి ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీ లతో పాటుగా నిరసన చేశారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు గత ఎన్నికల్లో ఇచ్చిన హామీలు అమలు చేయకుండానే జగన్ మళ్ళీ ప్రజల వద్దకు ఓట్ల కోసం వస్తున్నారని అన్నారు. నిరుద్యోగులు ని ముంచేసారని జాబ్ క్యాలెండర్ ఏమైంది అని అడిగారు. ఎమ్మెల్యేలుగా అసెంబ్లీ కి వెళ్తున్న తమని ఆపే హక్కు పోలీసులకు లేదని చెప్పారు రాబోయే ఎన్నికల్లో ప్రజలకి వైసిపిని పాత్ర వేయడం ఖాయమని బాలయ్య అన్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version