అనంతపురం జిల్లాలో యధేచ్చగా బలిజల అణచివేత…

-

రాయలసీమలో వైసిపి రెడ్లకే ప్రాధాన్యత ఇస్తుంది కాబట్టి బలిజలు టిడిపికే ఓట్లు వేయడం సహజం.
అయితే 2014లో అనంతపురం జిల్లానుండి హిందూపూర్ నుండి వైసిపి అభ్యర్థిగా బరిలో దిగన ఏకైక బలిజ నవీన్ నిశ్చల్ మాత్రమే.

2014లో టిడిపి జిల్లాలో బలిజలకు ఒక్క స్థానం కూడా కేటాయించలేదు.
గతంలో వైయస్ మరణానంతరం ప్రజల్లోని సానుభూతిని తనకు అనుకూలంగా మలచుకోడానికి కోస్తా రాయలసీమలలో వైయస్సార్ పార్టీ స్థాపించిన కొత్తలో జగన్ 17 నియోజకవర్గాల్లో ఉపఎన్నికలకు వెళ్ళినప్పుడు చంద్రబాబు టిడిపి ఓటమి ఖాయమని గ్రహించి ఎలాగూ ఓడిపోయే ఎన్నికలే కదా అని 6 స్థానాలను కాపు బలిజలకు కేటాయించాడు.

అనంతపురం జిల్లాలో అనంతపురం, రాయదుర్గం నియోజకవర్గాలను బలిజలకు కేటాయించాడు చంద్రబాబు. ఆ ఎన్నికల్లో 17సీట్లలో ఒక్క సీటు కూడా టిడిపి గెలవలేకపోయింది.
అయితే రాష్ట్ర విభజన అనంతరం 2014 సార్వత్రిక ఎన్నికల్లో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ టిడిపికి మద్ధతివ్వడంతో గెలుపు గ్యారెంటీ అని గ్రహించిన చంద్రబాబు అనంతపురం జిల్లాలో 14 అసెంబ్లీ నియోజకవర్గాలుంటే అందులో అంటే 6 అసెంబ్లీ స్థానాలను టిడిపిలో కమ్మలకే కేటాయించాడు.

కమ్మ అభ్యర్థులు

1)అనంతపూర్ .. ప్రభాకర్ చౌదరి కమ్మ TDP
2)రాప్తాడు…. పరిటాల సునీత కమ్మ TDP
3)హిందూపూర్… నందమూరి బాలకృష్ణ కమ్మ TDP
4)కళ్యాణదుర్గం.. హనుమంతరాయ చౌదరి కమ్మ TDP
5)ధర్మవరం…. వరదాపురం సూరి కమ్మ TDP
6)ఉరవకొండ…. పయ్యావుల కేశవ్ కమ్మ TDP
వీరిలో ఉరవకొండ నుండి పోటీ చేసిన పయ్యావుల కేశవ్ ఓడిపోతే అతనిని MLC ని చేశారు.

ఇతర కులాల అభ్యర్థులు.

7)రాయదుర్గం…. కాలువ TDP శ్రీనివాసులు — బోయ TDP
8)పెనుగొండ… పార్థసారథి… కురుబ TDP
9)గుంతకల్ … జితేందర్ గౌడ్ .. గౌడ/ఈడిగ TDP
10)తాడిపత్రి… జెసి TDP ప్రభాకరరెడ్డి … రెడ్డి TDP
11)పుట్టపర్తి… పల్లె TDP రఘునాధరెడ్డి… రెడ్డి TDP
12)శింగనమల…. యామినీబాల… SC రిజర్వుడ్ TDP
13)మడకశిర… ఈరన్న … SC రిజర్వుడ్ TDP
14)కదిరి …. కందికుంట వెంకట ప్రసాద్ … తొగట(చేనేత) TDP
అనంతపూర్ జిల్లాపరిషత్ ఛైర్మన్ ఛమన్ .. దూదేకుల TDP
హిందూపూర్ MP TDP… చేనేత.
అనంతపూర్ MP TDP….. రెడ్డి.
వీరిలో ఒక్క బలిజ అభ్యర్థికి టిడిపి టికెట్ కేటాయించలేదు.
అనంతపురం జిల్లాలో అనంతపూర్ అర్భన్ , పుట్టపర్తి, రాయదుర్గం, హిందూపూర్, ధర్మవరం, కదిరి నియోజకవర్గాలలో బలిజలు అధికంగా ఉంటారు.
అనంతపురం జిల్లాలో కమ్మలు ఒక్క కళ్యాణదుర్గం నియోజకవర్గంలో మాత్రమే సుమారు 25 వేల ఓటర్లున్నారు.
మిగిలిన ఏ నియోజకవర్గంలోనూ 1000 నుండి 5000 లకు మించరు.
జిల్లాలో అత్యల్ప జనాభా ఉన్న సామాజికవర్గం కమ్మ.
కానీ అధిక జనాభా కలిగిన బలిజలతో ఓట్లు వేయించుకుని మొత్తం కమ్మలే ఆక్రమించారు.
అన్ని పదవులూ కమ్మలకే.
ఇతర కులాలకు తలా ఒక్క సీటు ఇచ్చిన చంద్రబాబుకు బలిజలు మాత్రం కనబడకపోవడమంటే బలిజలంటే ఎంత చులకనాభావం?

ఇవేకాక

హిందూపురం మున్సిపల్ ఛైర్మన్ రావెళ్ళ లక్ష్మి కమ్మ.
హిందూపూర్ మున్సిపల్ కమిషనర్ కమ్మ.
హిందూపూర్ తహసీల్దార్ (MRO) కమ్మ.
హిందూపూర్ 1 టౌన్ SI కమ్మ.
హిందూపూర్ ఫైర్ ఆఫీసర్ కమ్మ.
అనంతపూర్ మేయర్ కమ్మ.
ఇవేకాక సర్పంచ్ లు, MPTC,ZPTC లలో కూడా వారే అధికం.
బలిజలారా మేలుకోండి.
మన ఓట్లతో గెలిచి మననే అణచివేస్తున్న రాజకీయ పార్టీలను భూస్థాపితం చేసేవరకూ పోరాడుదాం.
బానిసత్వాన్ని వీడుదాం…
ఆత్మ గౌరవం కోసం పోరాడుదాం.

– సోర్సు : సోష‌ల్ మీడియా యాక్టివిస్ట్ – జ‌న‌సేన

Read more RELATED
Recommended to you

Latest news