బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు.. హిందువుల ఇళ్లనే కూల్చుతున్నారు!

-

ఢిల్లీ : తెలంగాణ బిజెపి అధ్యక్షులు బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. తెలంగాణలో అభివృద్ధిని మతకోణంలో చూస్తున్నారని..హిందువులు నివసించే ప్రాంతాలలో రోడ్ల విస్తరణ పేరుతో ఇళ్ల కూల్చి వేతలకు పాల్పడుతున్నారని వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. పాతబస్తీలో పన్నులు కట్టకపోయినా, రోడ్లు ఇరుకుగా ఉన్నా అక్కడ కూల్చివేతలకు పాల్పడే ధైర్యం కేసీఆర్ కు లేదన్నారు. ఒక వర్గానికి ఒక న్యాయం, మరొక వర్గానికి మరో న్యాయం ఉండకూడదని మండిపడ్డారు.

పాతబస్తీ అభివృద్ధిని టీఆర్ఎస్ , ఎంఐఎం అడ్డుకుంటున్నాయని.. గతంలో కాంగ్రెస్ పార్టీ, ఇప్పుడు టీఆర్ఎస్ పార్టీలు ఒక వర్గానికి కొమ్ముకాస్తున్నాయని విమర్శించారు. కేసీఆర్ , టీఆర్ఎస్ పార్టీ కి ధైర్యం ఉంటే పాతబస్తీలో రోడ్లు వెడల్పు చెయ్యాలని సవాల్ విసిరారు. ప్రజల స్పందన, బిజెపి కు ఆదరణ చూసిన తరువాత ఆందోళన చెందిన సీఎం కెసిఆర్ “దళితబంధు”పథకాన్ని తీసుకు వచ్చారని చురకలు అంటించారు.

సిఎం కేసీఆర్ ఫేక్.. ఆయన పథకాలు ఫేక్ అని మండిపడ్డారు. హుజూరాబాద్ ఉపఎన్నికల ను దృష్టిలో ఉంచుకుని దిగజారుడు రాజకీయాలకు పాల్పడుతున్నారని.. “ఫేక్ ఐడి” కార్డులు, తప్పుడు ప్రచారాలు చేసే స్థాయికి దిగజారారని నిప్పులు చెరిగారు. కోట్ల రూపాయలు కుమ్మరించి ఎలాగైనా ఎన్నికలలో గెలవాలని ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు.

Read more RELATED
Recommended to you

Latest news