సర్కార్ ఖజానా కోసమే మద్యం టెండర్లు : బండి సంజయ్‌

-

ఓట్ల కోసం కొత్త కొత్త స్కీమ్ లు తెచ్చే కేసీఆర్ మాటలను ఎవరూ నమ్మొద్దన్నారు ఎంపీ బండి సంజయ్‌. మరోసారి బీఆర్ఎస్ పార్టీ గెలిస్తే ప్రజల కొంప కొల్లేరే అని చెప్పారు. ఈ నాలుగు నెలలు ఒకటో తారీఖు జీతాలేస్తే నమ్మి ఓట్లేస్తే ..ప్రభుత్వ ఉద్యోగులకు మళ్లీ జీతాలు నెల తర్వాత కూడా రావన్నారు. కాంగ్రెస్ ను నమ్మినా మళ్లీ వచ్చేది అవినీతి ప్రభుత్వమే అని చెప్పారు. కాంగ్రెస్ వస్తే అప్పుల ఊబిలో ఉన్న రాష్ట్రాన్ని నడపడం ఆ పార్టీ నాయకులకు సాధ్యం కాదన్నారు. కేంద్రంలో అధికారంలోకి వచ్చేది బీజేపీ పార్టీనే అని ధీమా వ్యక్తం చేశారు.

ఏపీ బాధ్యతల్లో బండి సంజయ్ - విజయవాడ కేంద్రంగా..!! | MP Bandi Sanjay  becoming active in AP BJP, likely to appoint as party incharge - Telugu  Oneindia

పెద్దపల్లిలో బాలిక హత్య కేసును నీరుగార్చారని ఆరోపించారు. హత్యలు, అత్యాచారాల్లో బాధితులను ప్రలోభపెడుతున్నారని ఆరోపించారు. బాలిక మృతిని ఆత్మహత్యగా తేల్చేశారని, ఇది దిశ కంటే దారుణమైన సంఘటన అన్నారు. బీఆర్ఎస్ మంత్రే కేసును మూసే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. బాలిక కేసులో సీఎంవో నుండి పోలీసులపై ఒత్తిడి ఉందన్నారు. పెద్దపల్లి ఘటనపై సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు.

 

 

Read more RELATED
Recommended to you

Latest news