ప్రీపెయిడ్ – పోస్ట్ పెయిడ్ వాళ్లతో కెసిఆర్ చేసేదేముంది? – బండి సంజయ్

-

సీఎం కెసిఆర్ పై మరోసారి తీవ్ర స్థాయిలో మండిపడ్డారు బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్. ప్రీపెయిడ్ – పోస్ట్ పెయిడ్ లీడర్లతో కేసీఆర్ చేసేదేముంది? అని ప్రశ్నించారు. వాళ్లని పిలిపించుకొని పేపర్లకు ఫోటోలు ఇవ్వడం తప్ప లోపల ఏం మాట్లాడారు, ఏం జరిగింది అన్నది మాత్రం ఎవరికీ తెలియదన్నారు. కెసిఆర్ ప్రభుత్వం వెంటిలేటర్ పై ఉందని అన్నారు. కెసిఆర్ కుటుంబానికి మానవ హక్కుల పై మాట్లాడే నైతిక హక్కు లేదన్నారు బండి సంజయ్.

Bandi Sanjay Kumar | బండి సంజ‌య్
Bandi Sanjay Kumar | బండి సంజ‌య్

కొండగట్టు బస్సు ప్రమాదం జరిగిన ఘటన స్థలాన్ని సందర్శించారు. ప్రమాదంలో గాయపడిన వారు ఇప్పటికీ చాలామంది బాధితులు బెడ్ మీద నుంచి లేవలేని పరిస్థితి ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. ఘటన జరిగి ఏళ్లు గడిచినా కేసీఆర్ ఇప్పటికీ బాధిత కుటుంబ సభ్యులకు భరోసా కల్పించే ప్రయత్నం కూడా చేయలేదని మండిపడ్డారు. కనీసం వారి వైద్యానికి డబ్బులు చెల్లించలేక బాధితులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. ఇప్పటికైనా కేసీఆర్ స్పందించి కొండగట్టు బస్సు ప్రమాద బాధితులను ఆదుకోవాలని డిమాండ్ చేశారు.

Read more RELATED
Recommended to you

Latest news