ప్రతి ఇంటిపై జాతీయ జెండాను ఎగరేసి దేశభక్తిని చాటాలి – బండి సంజయ్

-

‘‘హర్ ఘర్ తిరంగా జెండా‘‘లో భాగంగా అమ్మనబోలులోని ప్రజా సంగ్రామ యాత్ర శిబిరం వద్ద మువ్వన్నెల జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, ఎంపీ బండి సంజయ్ కుమార్. జాతీయ జెండా ఆవిష్కరణలో పాదయాత్ర ప్రముఖ్ డాక్టర్ జి.మనోహర్ రెడ్డి, యాదాద్రి భువనగిరి జిల్లా అధ్యక్షులు పీవీ శ్యాంసుందర్ తదితరులు పాల్గొన్నారు. దేశ భక్తి పాటలు, స్వాతంత్ర సమరయోధుల వీరోచిత పోరాటాల గీతాల ఆలాపనతో పాదయాత్ర శిబిరం సందడిగా మారింది.

ఆజాదీ కా అమ్రుత మహోత్సవ్ లో భాగంగా 75 ఏళ్ల స్వాతంత్ర్య దినోత్సవాలను పురస్కరించుకుని పంద్రాగస్టు వేడుకలను అత్యంత ఘనంగా నిర్వహించే విషయంలో ప్రతి ఒక్కరిని సన్నద్దం చేయడంలో భాగమే నేటి ’హర్ ఘర్ తిరంగా జెండా’ ఉద్దేశం అన్నారు బండి సంజయ్ కుమార్. ప్రతి ఇంటిపై జాతీయ జెండాను ఎగరేసి దేశభక్తి స్పూర్తిని చాటిన బీజేపీ కార్యకర్తలందరికీ అభినందనలు తెలిపారు. స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను అత్యంత ఘనంగా నిర్వహించడం ద్వారా దేశభక్తిని ప్రపంచానికి చాటి చెబుదామని వెల్లడించారు.

 

Read more RELATED
Recommended to you

Latest news