బండి సంజయ్ పాదయాత్రలో రెచ్చిపోయిన దొంగలు

-

బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ చేపట్టిన ఐదవ విడత ప్రజా సంగ్రామ యాత్ర మంగళవారం రోజు జగిత్యాల జిల్లా కొడిమ్యాల మండలానికి చేరుకుంది. పాదయాత్రకు ప్రజలు భారీ సంఖ్యలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా దొంగల మర్రి స్టేజి వద్ద చొప్పదండి నియోజకవర్గం పరిధిలోని బిజెపి మండల అధ్యక్షులు బండి సంజయ్ కి గజమాలతో పెద్ద ఎత్తున స్వాగతం పలికారు.

మరికొంతమంది బండి సంజయ్ తో ఫోటోలు దిగేందుకు ఆసక్తి చూపిస్తుండగా.. ఇదే అదునుగా భావించిన కొందరు జేబుదొంగలు తమ చేతివాటం ప్రదర్శించారు. నాయకుల నుంచి దాదాపు రెండు లక్షల వరకు చోరీ అయినట్లుగా తెలుస్తోంది.

Read more RELATED
Recommended to you

Latest news