కేసీఆర్ కు ఆ శాపం ఉంది అందుకే అబద్ధాలు చెబుతారు : బండి సంజయ్

-

బీజేపీ అధికారంలోకి వస్తే విద్యుత్ మీటర్లు పెడతారని ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తున్నారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ అన్నారు. మోటార్లకు మీటర్లు పెట్టాల్సిన అవసరమే లేదని నిరూపిస్తామని తెలిపారు. రైతులను బీజేపీ ఇబ్బంది పెడుతున్నట్లు ఆధారాలు చూపించగలరా అని ప్రశ్నించారు. సీఎం కేసీఆర్ ఎప్పుడూ నిజం చెప్పరని అన్నారు. కేసీఆర్ నోరు విప్పితే అబద్ధాలే చెబుతారని మండిపడ్డారు. కేసీఆర్ కు నిజాలు చెబితే తల వేయిముక్కలవుతుందనే శాపం ఉందని సంజయ్ ఎద్దేవా చేశారు. అందుకే ఆయన నోటి నుంచి నిజం రాదని ఆరోపించారు.

మోటార్లకు మీటర్లు పెట్టాలనే కేసీఆర్‌ ఆలోచన వెనుక కుట్ర ఉందని బండి సంజయ్ ధ్వజమెత్తారు. ఉచిత విద్యుత్‌ ఇవ్వడం కేసీఆర్‌కు చేతకావట్లేదు.. రాష్ట్రం ఆర్థికంగా దివాళా తీసింది.. ప్రభుత్వం దగ్గర పైసల్లేవు అని బండి సంజయ్‌ వ్యాఖ్యానించారు. విద్యుత్‌ సంస్థల వద్ద రూ.50 వేల కోట్లు అప్పు చేశారు.. అప్పు తీర్చకపోతే రాష్ట్రంలో డిస్కంలన్నీ కుప్పకూలే పరిస్థితి ఏర్పడిందని సంజయ్ పేర్కొన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news