కరీంనగర్ ను వదిలేసి.. అక్కడి నుంచి ఎమ్మెల్యే గా బండి సంజయ్ పోటీ !

-

తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్..వరుస పాదయాత్రలతో దూసుకుపోతున్నారు. అయితే, ఈ నేపథ్యంలోనే, బండి సంజయ్‌ పై ఓ వార్త వైరల్‌ అవుతోంది. బండి సంజయ్ ముథోల్ నియోజకవర్గం నుండే వచ్చే అసెంబ్లీ ఎన్నికల బరిలో దిగుతారనే ప్రచారం జరుగుతుంది. అందుకే బైంసా పేరు మార్చుతామని, ముథోల్ ను దత్తగా తీసుకుంటానని ప్రచారించాలంటూ కాషాయ శిబిరంలో చర్చ సాగుతోందట.

సంజయ్ సామాజిక వర్గానికి చెందిన మున్నూరు కాపులు నియోజకవర్గంలో బలమైన వర్గంగా ఉన్నారు. ఈ వర్గానికి చెందిన వారే 47 వేల మంది ఓటర్లు ఉన్నట్లు తెలుస్తోంది. ఇక్కడ నుండి పోటీ చేస్తే తన సామాజిక వర్గం అంతా పార్టీ వైపు నిలబడే అవకాశాలు ఉన్నాయని భావిస్తున్నారట. దీనికి తోడు నియోజకవర్గంలో హిందుత్వ ఓట్లు కూడా బాగానే ఉండటంతో, విజయం ఖాయమని భావిస్తున్నారని సమాచారం. అలాగే, ఎంఐఎం పార్టీ బైంసా మున్సిపాలిటీని అనేక సంవత్సరాలుగా ఏలుతోంది. ఎంఐఎం కోటను కూల్చడమే తన లక్ష్యం అంటున్నారు సంజయ్.

Read more RELATED
Recommended to you

Latest news