తెలంగాణ సచివాలయం… తాజ్ మహల్ లాగా ఉంది – బండి సంజయ్‌

-

తెలంగాణ సచివాలయం… తాజ్ మహల్ లాగా ఉందని మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు బండి సంజయ్‌. సంగారెడ్డి జిల్లాలో పర్యటించిన బండి సంజయ్‌ ఈ వ్యాఖ్యలు చేశారు. మంత్రి హరీష్ రావుకి అగ్గిపెట్టే ఎందుకు దొరకలేదో సీబీఐ విచారణ జరిపించాలి… ఇది కేసీఆర్ సొంత జిల్లా అంటున్నారు ఎం పీకిండు అంటూ ఆగ్రహించారు.

30 లక్షల విద్యార్థుల భవిష్యత్తు నాశనం చేశాడు కేసీఆర్…. TSPSC లో జరిగిన అవకతవకలపై సిట్టింగ్ జడ్జ్ తో విచారణ జరిపించాలని డిమాండ్‌ చేశారు.నీ కొడుకుని బర్తరఫ్ చేయాలి..మెడలు పట్టి బయటికి గెంటు… మరో 5 నెలల్లో మన ప్రభుత్వం వస్తుందన్నారు. మేము అధికారంలోకి వస్తే ప్రతి ఏడాది జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తామని.. ఉద్యోగులు కూడా కేసీఆర్ ని వ్యతిరేకిస్తున్నారని పేర్కొన్నారు బండి సంజయ్‌. *ముఖ్యమంత్రి కొడుకు, కూతురు లుచ్చా దందా, లిక్కర్ దందా చేస్తున్నారని ఓ రేంజ్‌ లో సీరియస్‌ అయ్యారు.

Read more RELATED
Recommended to you

Latest news