13న ప్రతి ఇంటిపై జాతీయ జెండా రెపరెపలాడాల్సిందే – బండి సంజయ్

-

13న ప్రతి ఇంటిపై జాతీయ జెండా రెపరెపలాడాల్సిందేనని బండి సంజయ్ అన్నారు. నిత్యం రద్దీగా ఉండే ప్రాంతాల్లో, వ్యాపార సముదాయాల్లో జెండా ఎగరాల్సిందేనని పేర్కొన్నారు. 75 ఏళ్ల స్వాతంత్ర్య దినోత్సవాలను పురస్కరించుకుని ఈనెల 13న తెలంగాణలోని ప్రతి కార్యకర్త ఇంటిపై జాతీయ పతకాన్ని ఎగరేయాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, ఎంపీ బండి సంజయ్ కుమార్ పిలుపునిచ్చారు.

దీంతోపాటు నిత్యం రద్దీగా ఉండే ప్రాంతాల్లో, వ్యాపార సముదాయాలపైన జాతీయ పతాకాన్ని ఎగరేసేలా చూడాలని సూచించారు. 9న క్విట్ ఇండియా డే రోజున గుండ్రాంపల్లిలో జాతీయ జెండాలతో భారీ ర్యాలీ నిర్వహించాలని పిలుపునిచ్చారు. యువ, మహిళా మోర్చా కార్యకర్తలంతా ర్యాలీలో పాల్గొనండని ఆదేశాలు జారీ చేశారు. 14న స్వాతంత్ర సమరయోధుల విగ్రహాల శుద్ధి చేసి అలంకరించండని.. తెలిపారు బండి సంజయ్. దేశ సమైఖ్యత ప్రపంచ వ్యాప్తంగా తెలిసేలా.. ఈ కార్యక్రమం చేయాలన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news