తెలంగాణకు ద్రోహం చేసింది కేసీఆర్..ముక్కు నేలకు రాయాల్సిందే : బండి సంజయ్‌

-

బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ మరోసారి సీఎం కేసీఆర్‌పై సంచలన వ్యాఖ్యలు చేశారు. AP ప్రాజెక్టులు కడుతున్నట్టు సీఎం కేసీఆర్‌కు తెలియదు అట.. ఇద్దరు ముఖ్యమంత్రులు కూడబల్లుక్కొని కుట్ర చేస్తున్నారని ఫైర్‌ అయ్యారు బండి సంజయ్‌. తెలంగాణకు ద్రోహం చేసింది కేసీఆర్… కేసీఆర్ వల్లనే రాష్ట్రానికి రావాల్సిన నీళ్లు రాకుండా పోయాయని మండిపడ్డారు. 299 tmc లకు ఒప్పుకున్నాడు..ఇప్పుడు 50-50 అంటున్నారని.. 575 టీఎంసీ లు రావాల్సిన నీటికి బదులు 299 టీఎంసీలు మాత్రమే వస్తున్నాయని నిప్పులు చెరిగారు. దీనికి కారణమైన సీఎం కేసీఆర్‌ ముక్కు నేలకు రాసి క్షమాపణ చెప్పాలని డిమాండ్‌ చేశారు.

ఏపీ తో రాజీపడ్డది కేసీఆర్ అని…జగన్‌ తో కుమ్మక్కు అయ్యి అపెక్స్ కౌన్సిల్ సమావేశాన్ని వాయిదా వేయించాడని నిప్పులు చెరిగారు. తెలంగాణ ప్రజల క్షేమం సీఎం కేసీఆర్‌ పట్టించుకోవడం లేదని.. దళితులకు 3 ఎకరాలు ఇవ్వడానికి భూమి దొరకడం లేదు కానీ… అమ్ముకోవడానికి మాత్రం ఉన్నాయని ఫైర్‌ అయ్యారు.. దేశంలో అత్యంత అవినీతి పరుడు కేసీఆర్, ఆయన కుటుంబమని మండిపడ్డారు.

125 అడుగుల విగ్రహం ఎందుకు ఏర్పాటు చేయడం లేదో సీఎం సమాధానం చెప్పాలని.. ఇంటికి 10 లక్షలు ఇస్తా అంటున్నాడు… ఎవరు నమ్మే పరిస్థితి లో లేరని చురకలు అంటించారు. చిత్తశుద్ధి ఉంటే ఇప్పటి వరకు ఇచ్చిన హామీలు నెరవేర్చాలని డిమాండ్‌ చేశారు.

Read more RELATED
Recommended to you

Latest news