గల్లీలో తొడలు, డిల్లీలో సలాంలు కొట్టడం తప్ప ఏమీ రాదు !

-

బీజేపీ సైద్ధాంతిక శిక్షణా తరగతుల్లో పాల్గొన్న తెలంగాణ బీజేపీ చీఫ్ బండి సంజయ్ కుమార్ కీలక వ్యాఖ్యలు చేశారు.  శిక్షకులనుద్దేశించి మాట్లాడిన సంజయ్ అధికారమే లక్ష్యంగా కేసిఆర్ ప్రజావ్యతిరేఖ ప్రభుత్వాన్ని ఓడించడమే లక్ష్యంగా ప్రతీ కార్యకర్తను నిర్మాణం చెయ్యాలని కోరారు. భారతీయ జనతా పార్టీలో ప్రతీ కార్యకర్త సైద్ధాంతిక నిబద్దత కలిగి ఉండేలా తయారు చెయ్యాలని ,అందుకు ఈ శిక్షణా తరగతులే వేదిక అవ్వాలని ఆయన అన్నారు.

సమాజంలో అన్ని వర్గాల ప్రజలను ,ఉద్యమకారులను ,మేధావులను కలుపుకపోయే విధంగా సమాయత్తం కావాలని ఆయన పిలిపునిచ్చారు. ప్రజలు మన పై పెట్టుకున్న నమ్మకాన్ని విశ్వాసాన్ని నిలపెట్టెలా ప్రతీ కార్యకర్త సైనికుడిలా తయ్యారవ్వాలని, కేసిఆర్ గల్లీలో తొడలు కొట్టడం డిల్లీలో సలాం లు కొట్టడం తప్ప ఆయన చేసేదేం లేదని అన్నారు. బీజేపీ గెలుపు వాతావరణాన్ని దెబ్బ తియ్యాలని ఒక్కరోజు రైతుల పై ముసలి కన్నీరు కార్చి భారత్ బంద్ లో పాల్గొన్న కేసిఆర్ ఢిల్లీకి వెళ్లి కూడా అక్కడ రైతుల ధర్నాకు ఎందుకు మద్దతు పలకలేదు ,కనీసం కలవలేదు…? అని ఆయన ప్రశ్నించారు.

Read more RELATED
Recommended to you

Latest news