వ్యక్తి అకౌంట్‌లోకి రూ.6వేల కోట్లు.. పంపిందెవరో?

-

‘డబ్బులు ఎవరికీ ఊరికే రావు’ ఓ వాణిజ్య ప్రకటనలో వినిపించే డైలాగ్‌ ఇది. ఈ ప్రకటనలో పేర్కొన్నట్లుగా డబ్బులు మాత్రం ఎవరికీ ఊరికే రావు. ఇది వందకు వంద శాతం సత్యం. అలాంటిది బిహార్‌లోని లఖీసరాయ్‌ జిల్లా బర్హియా గ్రామానికి చెందిన సుమన్‌ కుమార్‌ డీమ్యాట్‌ ఖాతాలో వారం రోజుల క్రితం ఏకంగా రూ.6,000 కోట్లకుపైగా నగదు జమైంది. ఈ మొత్తాన్ని పంపించింది ఎవరో తెలియడం లేదు.

స్టాక్‌ మార్కెట్‌లో ట్రేడింగ్‌ చేసే సుమన్‌ కుమార్‌కు.. కోటక్‌ సెక్యూరిటీస్‌ మహీంద్రా బ్యాంకులో డీమ్యాట్‌ ఖాతా ఉంది. మరోవైపు, వారం రోజుల క్రితం అందులోకి  రూ.6,833.42 కోట్లు వచ్చి చేరాయి. ఇటీవల ఖాతా తనిఖీ చేసుకున్న సుమన్‌కు విషయం తెలిసింది.

ఇప్పటికీ డబ్బులు ఖాతాలోనే ఉన్నాయి. పొరపాటున నగదు బదిలీ అయిందనుకున్నా.. దీనిపై ఇంతవరకు ఎవరూ పోలీసులను సంప్రదించకపోవడం ఆశ్చర్యం కలిగిస్తోంది. దీనిపై తమకు పూర్తి సమాచారం అందలేదని సూర్యగఢ స్టేషన్‌ హౌస్‌ అధికారి చందన్‌ కుమార్‌ తెలిపారు.

Read more RELATED
Recommended to you

Latest news