బిజినెస్ చేస్తున్న వారికి ఎస్బీఐ గుడ్ న్యూస్..కోటి వరకూ రుణం పొందే అవకాశం..!!

-

ప్రముఖ ప్రభుత్వ బ్యాంక్ ఎస్బీఐ బ్యాంక్ వరుస గుడ్ న్యూస్ లను అందిస్తుంది..ఇప్పుడు మరో గుడ్ న్యూస్ ను చెప్పింది.బిజినెస్ చేయాలనీ అనుకోనేవారికి మంచి అవకాశం..బ్యాంక్ కు వెళ్ళి బిజినెస్ లోన్ ను అప్లై చేయ్యాలి.ఎస్‌బీఐ అర్హత కలిగిన వారికి పలు రకాల బిజినెస్ లోన్స్ అందిస్తోంది. వీటిల్లో స్టాండప్ ఇండియా లోన్ కూడా ఒకటి.ఎస్‌బీఐ స్టాండప్ ఇండియా లోన్ కింద అర్హత కలిగిన వారు రూ.కోటి వరకు రుణం పొందొచ్చు. అలాగే కనీసం రూ. 10 లక్షల రుణం తీసుకోవచ్చు. వర్కింగ్ క్యాపిటల్ ఫెసిలిటీస్ కోసం ఈ లోన్ పొందొచ్చు. ఎస్‌సీ, ఎస్‌టీ, మహిళలు లక్ష్యాంగా బ్యాంక్ ఈ రుణాలు అందిస్తోంది.

మ్యానుఫ్యాక్చరింగ్, సర్వీసెస్ లేదంటే ట్రేడింగ్ సెక్టార్ కింద గ్రీన్‌ఫీల్డ్ ప్రాజెక్టుల ఏర్పాటుకు ఈ లోన్ పొందొచ్చు. వడ్డీ రేటు ఆకర్షణీయంగా ఉంటుందని బ్యాంక్ పేర్కొంటోంది. రుణ రేటు ఎంసీఎల్ఆర్‌తో లింక అయ్యి ఉంటుంది.. ఎటువంటి తనఖా లేకుండానే ఈ తరహా రుణాలు పొందొచ్చు. క్రెడిట్ గ్యారంటీ స్కీమ్ ఫర్ స్టాండప్ ఇండియా స్కీమ్ కింద ఈ రుణాలు కవర్ అవుతాయి. తీసుకున్న రుణాన్ని 7 ఏళ్లలోపుగా తిరిగి చెల్లించాల్సి ఉంటుంది. మారటోరియం పీరియడ్ 18 నెలలు పొందొచ్చు. ప్రాసెసింగ్ ఫీజు రుణ మొత్తంలో 0.2 శాతంగా ఉంటుంది. జీఎస్‌టీ పడుతుంది. లోన్ కోసం ఆన్‌లైన్‌లో కూడా అప్లై చేసుకోవచ్చు..

స్టాండప్ ఇండియా లోన్ పై క్లిక్ చేసి అప్లై చేసుకోవచ్చు.. కేంద్ర బ్యాంక్ రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా  కీలక పాలసీ రేట్లను పెంచుకుంటూ వెళ్తోంది. ఈ క్రమంలోనే బ్యాంకులు కూడా రుణ రేట్లను పెంచేస్తున్నాయి. ఇప్పటికే ఎస్‌బీఐ సహా పలు బ్యాంకులు రుణ రేట్లు పెంచాయి. ఇప్పుడు మరోసారి రుణాలపై వడ్డీ రేట్లు పెరగొచ్చనే అంచనాలు ఉన్నాయి. ఇందుకు ప్రధాన కారణం ఆర్‌బీఐ మరోసారి రెపో రేటును పెంచే అవకాశం ఉందని మార్కెట్ నిపుణులు అంటున్నారు.. మళ్ళీ పెరిగితే అన్ని వడ్డీ రేట్లు కూడా భారీగా పెరుగుతాయని సమాచారం..

Read more RELATED
Recommended to you

Latest news